పన్ను ఎగవేతదారులకు ఇక నుండి చుక్కలే?
దేశవ్యాప్తంగా కొన్ని వందల మంది పన్ను ఎగవేతదారుల ఉన్నారని ఇకపై వారి పప్పులు ఉదకవని ప్రభుత్వం హెచ్చరించింది,మరియు చర్యలు కూడా చాల కణాంగా ఉందనున్నట్టు తెలిపారు.
దేశవ్యాప్తంగా కొన్ని వందల మంది పన్ను ఎగవేతదారుల ఉన్నారని ఇకపై వారి పప్పులు ఉదకవని ప్రభుత్వం హెచ్చరించింది,మరియు చర్యలు కూడా చాల కణాంగా ఉందనున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు రూ. 490 కోట్ల మేర పన్నులు ఎగవేసిన 24 మంది ఎగవేతదారుల జాబితాను ఆదాయ పన్ను శాఖ గురువారం విడుదల చేసింది. ఆదాయ, కార్పొరేట్ పన్ను డిఫాల్టర్ల పేరిట పత్రికల్లో బహిరంగ ప్రకటనలు ఇచ్చింది.
వీరిలో కొందరు ఆచూకీ దొరక్కుండా పోగా, మరికొందరి దగ్గర బకాయిలు చెల్లించడానికి సరిపడేంత అసెట్స్ లేవు. విజయవాడతో పాటు ఢిల్లీ, నాసిక్, సూరత్ తదితర నగరాలకు చెందిన బులియన్ ట్రేడింగ్, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్, ఫుడ్ ప్రాసెసింగ్ మొదలైన రంగాల సంస్థలు డిఫాల్టర్ల జాబితాలో ఉన్నాయి.
ఢిల్లీకి చెందిన సంస్థ స్టాక్ గురు, దాని భాగస్వామి లోకేశ్వర్ దేవ్ల పేరిట అత్యధికంగా రూ. 86.27 కోట్ల మేర పన్ను బకాయిలు ఉన్నారని వెల్లడించారు.