ఈ బడ్జెట్ ప్రతి ఒక్కరి ఆకాంక్షలను నెరవేరుస్తుందా
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏజన్సీలు భారత్ ఆర్థిక వ్యవస్థపై సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం ప్రకటించారు.
నిన్న జరిగిన అన్ని పార్టీల సమావేశంలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు మద్దతు తెలుపమని ప్రతిపక్ష పార్టీను కోరింది.ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అన్ని పార్టీలు ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించాలని ప్రధానమంత్రి కోరారు.భారతదేశం అభివృద్ధిపధంలో నడుస్తోందని,అని క్రెడిట్ రేటింగ్స్ లో భారతదేశం మెరుగైన అభివృద్ధి సాదిస్తుందని,ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశం పట్ల సానుకూలం వ్యక్తం చేస్తున్నాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వంటి దేశాలు సానుకూల అభిప్రాయాన్ని తెలుపుతున్నాయని,రానున్న బడ్జెట్ ప్రతి ఒక్కరి ఆకాంక్షలను నెరవేరుస్తుంది, ఆయన అన్నారు.
పార్లమెంటరీ కమిటీల వ్యవస్థ బడ్జెట్లో అన్ని అంశాలను చర్చించాలని, "గ్రామీణ భారతదేశం, రైతులు, దళితులు, గిరిజన సమాజాలు, కార్మికులు"ఈ బడ్జెట్ నుండి మంచి లబ్ది చేకూరుతుందని ఆయన అన్నారు.అన్ని ముఖ్యమైన బడ్జెట్ సమావేశాలని సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి,ఇందులో కేంద్ర బడ్జెట్ను బుధవారం ఆర్ధిక మంత్రి అరుణ్ జెట్లీ ప్రవేశపెట్టనున్నారు.
లోక్సభ, రాజ్యసభ సంయుక్త కూటమిని ఉద్దెశించి రాష్ట్రపతి కోవింద్ ప్రసంగం తర్వాత , 2018 బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతుంది.