For Quick Alerts
For Daily Alerts
రూ. 2 లక్షలకు మించిన డిపాజిట్లను ఐటీఆర్ ఫారంలో వెల్లడించాల్సిందే...
నోట్ల రద్దు సమయంలో ఎవరైనా రూ.2 లక్షలు అంతకంటే ఎక్కువ విలువ కలిగిన సొమ్మును డిపాజిట్ చేసి ఉంటే ఆ వివరాలను కొత్త ఐటీఆర్ ఫారంలో తెలపాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది.
|
నోట్ల రద్దు సమయంలో విపరీతంగా అక్రమ డిపాజిట్లు జరిగాయని ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. దాంతో వివిధ ఆదాయ వెల్లడి పథకాల ద్వారా అక్రమ ధన వివరాలు వెల్లడించాలని కోరింది. అయినప్పటికీ చాలా మంది వాటి వివరాలను దాచిపెట్టారు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ద్వారా ప్రభుత్వం సరికొత్త పంథాను అనుసరిస్తోంది. నోట్ల రద్దు సమయంలో ఎవరైనా రూ.2 లక్షలు అంతకంటే ఎక్కువ విలువ కలిగిన సొమ్మును డిపాజిట్ చేసి ఉంటే ఆ వివరాలను కొత్త ఐటీఆర్ ఫారంలో తెలపాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది.
చాలా మందికి ప్రస్తుతం ఒకే పేజీని కలిగిన రిటర్ను ఫారంను ఐటీ శాఖ అందుబాటులో ఉంచింది. పార్ట్ ఈలో పన్ను చెల్లింపుదారు బ్యాంక్ వివరాలను కోరుతోంది. దాని తర్వాతే మరో గడిలో నవంబరు 9 నుంచి డిసెంబరు 30 మధ్య రూ. 2 లక్షలు, అంతకు మించి చేసిన డిపాజిట్ వివరాలను నమోదు చేయాల్సిందిగా కోరుతున్నారు. దీంతో అక్రమ డిపాజిట్లను చేసిన వారికి గుండె గుబులుమంటోంది. ఒకవేళ ఇప్పుడు ఆ వివరాలను సమర్పించకపోయినా పాన్ కార్డు, ఆధార్ సాయంతో వాటన్నింటినీ క్రోడికరించే పనిలో ఆదాయపు పన్ను శాఖ నిమగ్నమైంది. ఇందుకు ఆర్బీఐ సైతం సహకరించే వీలుంది.
Comments
English summary
రూ. 2 లక్షలకు మించిన డిపాజిట్లను ఐటీఆర్ ఫారంలో వెల్లడించాల్సిందే... | disclose deposits of Rs 2 lakh and above in ITR forms
Story first published: Saturday, April 1, 2017, 12:03 [IST]