For Quick Alerts
For Daily Alerts
జన్ధన్ ఖాతాదారులారా! అప్రమత్తంగా ఉండండి
జన్ధన్ ఖాతాదారులు, హౌస్వైఫ్లు, కళాకారులు తమ బ్యాంకు ఖాతాలను జాగ్రత్తగా వాడుకోవాలని శుక్రవారం ప్రభుత్వం హెచ్చరిచ్చింది. నల్లధనం రూపంలో ఉన్న 500, 1000 నోట్లను మీ ఖాతా ద్వారా మార్పిడి చే
|
జన్ధన్ ఖాతాదారులు, హౌస్వైఫ్లు, చేతివృత్తుల వారిని తమ బ్యాంకు ఖాతాలను జాగ్రత్తగా వాడుకోవాలని శుక్రవారం ప్రభుత్వం హెచ్చరిచ్చింది. నల్లధనం రూపంలో ఉన్న 500, 1000 నోట్లను మీ ఖాతా ద్వారా మార్పిడి చేసేందుకు ప్రయత్నించకూడదని తెలిపింది. ఖాతాలను నల్లధనాన్ని మార్చేందుకు దుర్వినియోగం చేయరాదని సూచించింది. జన్ధన్ ఖాతాల్లో డిపాజిట్లు రూ. 50 వేలకు పరిమితం చేసిన సంగతి తెలిసిందే.
చాలా మంది ప్రజలు తమ ఖాతాల్లో రూ. 2లక్షల 50 లోపు డిపాజిట్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. పన్ను ఎగవేసిన డబ్బును ఖాతాల్లో డిపాజిట్ చేసినట్లయితే ఐటీ శాఖ నుంచి విచారణను ఎదుర్కొనాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Comments
English summary