అక్రమ డిపాజిట్ల సేకరణ కట్టడికి 'సచేత్'
ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు సేకరించి దానితో వ్యాపారం చేసేవారిని, జరిగే మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ చర్యలను ముమ్మరం చేసింది. మోసపూరిత సంస్థలపై ఫిర్యాదులు చేసేందుకు డిపాజిట్లను సేకరించే సంస్థల వివరాలను తెలిపేందుకు ఆర్బీఐ సచేత్ను ప్రారంభించింది.
నియంత్రణ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాచారా మార్పిడి కోసం సైతం ఈ వెబ్సైట్ ఉపయోగపడనుంది. అక్రమంగా డిపాజిట్లను సేకరించే వారి సమాచారాన్ని సేకరించేందుకు ఈ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రజలు కష్టించి సంపాదించిన డబ్బును సరైన సంస్థల వద్దే పొదుపు చేసేందుకు సచేత్ తోడ్పాటునందిస్తుందని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏదైనా సంస్థ ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించేందుకు అనుమతి కలిగి ఉందా లేదా అనే అంశాన్ని ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్.ఎస్ ముంద్రా తెలిపారు.