మరో ముందడుగు: హైదరాబాద్లో ఓలా షేరింగ్ సర్వీస్
హైదరాబాద్: ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్ధ ఓలా పూణె, హైదరాబాద్లో క్యాబ్ షేరింగ్ సర్వీసులను ప్రారంభించింది. దీంతో ఇండియాలోని ఏడు పట్టణాల్లో ఓలా షేరింగ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే బెంగుళూరు, ఢిల్లీ, ముంబై, కోల్కత్తా, చెన్నై పట్టణాల్లో ఓలా సంస్ధ ఈ సర్వీసులను అందిస్తోంది.
ఓలా యాప్ ద్వారా ఒక వాహనంలో ఒకే మార్గంలో వేర్వేరు వ్యక్తులు ప్రయాణించడాన్నే షేరింగ్గా పిలుస్తుంటాం. ఎవరైనా ప్రయాణికులు ఒకే మార్గంలో క్యాబ్లో వెళ్లాలని భావిస్తే, ఒక రైడ్లో ముగ్గురు వరకూ క్యాబ్లో వెళ్లేలా ఓలా షేరింగ్లో కొత్త ప్రణాళికలను తీసుకొచ్చింది.
కస్టమర్లు ఓలా యాప్లో రైడ్ నౌ ద్వారా షేరింగ్ బటన్ను నొక్కి వెళ్లాల్సిన ప్రాంతం పేరు టైప్ చేస్తే సరిపోతుంది. అయితే ఓలా షేరింగ్లో అయ్యే చార్జీని ప్రయాణానికి ముందు డ్రైవర్కు చెల్లించాల్సి ఉంటుంది. లాంచింగ్ ఆఫర్లో భాగంగా ప్రయాణ చార్జీల్లో 50 శాతం వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.
ఓలా షేరింగ్లో పూర్తి స్థాయిలో ఓలా సెక్యూరిటీ ఫీచర్లైన ట్రాక్ యువర్ రైడ్, షేర్ రైడ్ వివరాలు, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ లాంటి వాటి గురించి యాప్లో తెలుసుకోవచ్చు. భారత్లో రాబోయే రోజుల్లో షేరింగ్ మొబిలిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఓలా కేటగిరి హెడ్ ఇషా గుప్తా తెలిపారు. ఓలా యాప్లో ఓలా షేర్ ప్రత్యేకమైన కేటగిరిగా విభజించామన్నారు.