ఆన్లైన్ షాపింగ్: నెం.1 ఢిల్లీ, టైర్-2 సిటీల్లో గుంటూరు
న్యూఢిల్లీ: దేశంలో ఆన్లైన్ షాపింగ్ అత్యధికంగా జరిగే ప్రాంతాల్లో ఢిల్లీ-ఎన్సీఆర్ మొట్టమొదటి స్థానంలో ఉంది. ఆన్లైన్ షాపింగ్ దూసుకుపోతున్న ఈకామర్స్ దిగ్గజం ప్లిప్కార్ట్ #FlipTrends పేరిట్ ఓ సర్వేని నిర్వహించింది.
ఈ సర్వేలో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అత్యధికంగా అమ్ముతున్న ఈకామర్స్ దిగ్గజ వెబ్సైట్గా ప్లిప్కార్ట్ నిలిచింది. జనవరి 1 నుంచి డిసెంబర్ 14, 2015 వరకు నిర్వహించిన ఈ సర్వేలో సుమారు 50 లక్షల మంది ఆన్లైన్ షాపర్లు పాల్గొన్నారు.
ఆన్లైన్ షాపింగ్: నెం.1 ఢిల్లీ, టైర్-2 సిటీల్లో గుంటూరు
ఈ సర్వేలో ఆన్లైన్ షాపింగ్ జరిగే ప్రాంతాల్లో ఢిల్లీ-ఎన్సీఆర్ మొదటి స్ధానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నాగోరి మాట్లాడుతూ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ పట్టణాల వల్లే సౌత్ఇండియాలో ఈకామర్స్ రంగంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
ఆన్లైన్ షాపింగ్: నెం.1 ఢిల్లీ, టైర్-2 సిటీల్లో గుంటూరు
టైర్-1 పట్టణాల్లో పుణే అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో కోయంబత్తూరు, అహ్మదాబాద్, లక్నో పట్టణాలు ఉన్నాయి. కాగా తూర్పున ఒక్క భువనేశ్వర్ మాత్రమే ఫ్లిప్కార్ట్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఆన్లైన్ షాపింగ్ చేసే వారిలో 69 శాతం మంది మగవారే.
ఆన్లైన్ షాపింగ్: నెం.1 ఢిల్లీ, టైర్-2 సిటీల్లో గుంటూరు
ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా జరిగే టైర్-2 పట్టణాల్లో మంగుళూరు ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో మైసూర్, డెహ్రాడూన్ ప్రాంతాలు ఉన్నాయి. వీటి తర్వాతి స్థానాల్లో సేలం, గుంటూరు ప్రాంతాలు నిలిచాయి.
ఆన్లైన్ షాపింగ్: నెం.1 ఢిల్లీ, టైర్-2 సిటీల్లో గుంటూరు
ఆన్లైన్ షాపింగ్ చేసే వారిలో 25 నుంచి 34 మధ్య గల వయసు వారే ఎక్కువగా ఉన్నారు. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆన్లైన్ షాపింగ్ మరింతగా పెరిగిందని ఆయన తెలిపారు.