వేదాంతలో 4,000 మందికి ఉద్వాసన
మెటల్స్, మైనింగ్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వేదాంత రీసోర్సెస్ ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 4,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పింది. వేదాంత రీసోర్సెస్ యాజమాన్యం నిర్వహిస్తున్న కంపెనీల్లో వేదాంత అల్యూమినియం, బాల్కో, కెయిర్న్ ఇండియా, సెసాగోవా ఉన్నాయి.
వేదాంతలో 4,000 మందికి ఉద్వాసన
జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ కంపెనీలన్నింటిలోనూ 2,700 మంది ప్రత్యక్షంగా పని చేస్తున్న వారిని ఉద్యోగాల నుంచి తొలగించగా, మిగిలిన వారు పరోక్షంగా పనిచేస్తున్నారు.
వేదాంతలో 4,000 మందికి ఉద్వాసన
కంపెనీ ఇండియా విభాగాలైన బాల్కోలో 1000 మందిని, వేదాంత అల్యూమినియంలో 2000 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు తెలిసింది. సెసాగోవా, కెయిర్న్ ఇండియాలో కూడా 450 మందికి ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది.
వేదాంతలో 4,000 మందికి ఉద్వాసన
ఉద్యోగులను తొలగించిన విషయాన్ని వేదాంత అల్యూమినియం, బాల్కో, కెయిర్న్ ధ్రువీకరించాయి. బాల్కో పునర్ వ్యవస్థీకరణలో భాగంగా చత్తీస్గఢ్లోని కోర్బా రోలింగ్ మిల్లును మూసివేస్తున్నట్టు ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించింది.
వేదాంతలో 4,000 మందికి ఉద్వాసన
దీని వల్ల 1000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు నిరుత్సాహపూరితంగా ఉండడంతో ఇనుప ఖనిజం విభాగంలో భారీ వ్యయ నియంత్రణ చేపట్టినట్టు వేదాంత రీసోర్సెస్ ఒక ప్రకటనలో తెలిపింది.