ఎపిక్ టీవీలో 25 శాతం వాటాని కొనుగోలు చేసిన ముకేశ్ అంబానీ
ఎపిక్ టీవిలో ముకేశ్ అంబానీ ఆయన వ్యక్తిగత హోదాలో పెట్టుబడి పెట్టినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించలేదు. ఎపిక్ టీవిలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు 25% వాటా ఉంది. ముకేశ్ అంబానీ తన సొంత సంస్దల్లో ఒకటైన రిలయన్స్ పోర్ట్స్ అండ్ టర్మినల్స్ ద్వారా ఎపిక్ టీవిలో 25 శాతం వాటాను కొనుగోలు చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి ఇప్పటికే నెట్ వర్క్ 18 గ్రూపులో వాటా ఉన్న విషయం తెలిసిందే.
రాఘవ్ బహల్ ప్రమోటర్గా ఉన్న మీడియా కంపెనీలైన నెట్ వర్క్ 18, టీవి 18 బ్రాడ్ కాస్ట్లు రుణ భారంతో సతమతం అవుతుండగా వాటిలో సుమారు రూ. 2000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముకేశ్ అంబానీకి చెందిన ఒక సంస్ద ముందుకోచ్చిన విషయం తెలిసిందే. కొత్తగా ప్రారంభిస్తున్న ఈ ఎపిక్ టీవి డీటీహెచ్ ఫ్లాట్ ఫాంను ఉపయోగించుకోని ప్రతి రోజూ దాదాపు 4 నుండి 5 గంటల పాటు తాజా కార్యక్రమాలను ప్రసారం చేయనుంది.
వన్ఇండియా మనీ తెలుగు