కాంట్రాక్టును రద్దు చేసినందుకు నష్ట పరిహారం రూ. 4,100 కోట్లు: జీఎంఆర్
ఐతే ఈ లెక్కలు తప్పంటూ చెబుతున్న మాల్దీవుల సర్కార్.. దీనిపై తాము ఫోరెన్సిక్ ఆడిట్కు వెళతామని, అప్పుడే మాలే ఎయిర్పోర్టు పేరిట జిఎంఆర్ ఏమేరకు నిధులు సమకూర్చుకుందీ, దీనిపై వాస్తవంగా ఎంత సొమ్ము ఖర్చుచేశారన్న విషయం తేటతెల్లమవుతుందని అన్నారు. కంపెనీ వ్యయాలపై మేం అంతర్జాతీయ సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్ను చేపట్టనున్నాం. అసలు మాలె అంతర్జాతీయ ఎయిర్పోర్టు ద్వారా జీఎంఆర్ ఖజానాకు ఎంత మొత్తం వెళ్లిందనే సమాచారం తెలియాల్సి ఉంది. మాకున్న సమాచారం మేరకు జీఎంఆర్ ఈ మాలె ఎయిర్పోర్టు ఆధునీకరణ, నిర్వహణ కాంట్రాక్టును చూపించి ఒక బ్యాంకు నుంచి 35 కోట్ల డాలర్ల మేర రుణాన్ని తీసుకుంది. ఇందులోభాగంగా 15 కోట్ల డాలర్లనే వెచ్చించిందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ వహీద్ ప్రెస్ కార్యదర్శి మసూద్ ఇమాద్ పేర్కొన్నారు.
ఐతే ఫోరెన్సిక్ ఆడిట్కు మీరు సిద్ధమేనా అని జీఎంఆర్ కపూర్ను ప్రశ్నించగా, మాలెక్కలు పారదర్శకంగా వున్నాయి. అలాగే మాల్దీవుల ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఫోరెన్సిక్ ఆడిట్ క్లాజు లేదని అన్నారు. అయినప్పటికీ ఆడిట్ పట్ల తమకు అభ్యంతరం లేదని, కానీ ఇది సరైన న్యాయప్రక్రియ ద్వారా జరగాలని తెలిపారు. కాగా, తమ లెక్కల ప్రకారం జిఎంఆర్ పరిహారం 150 మిలియన్ డాలర్లకు తగ్గకుండా, గరిష్టంగా 350 మిలియన్ డాలర్లు మించని విధంగా వుంటుందని మాల్దీవుల సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. 2010లో గత మాల్దీవుల ప్రభుత్వ హయాంలో జీఎంఆర్ ఇన్ఫ్రా కుదుర్చుకున్న మాలె కాంట్రాక్టు(విలువ దాదాపు రూ.2,600 కోట్లు)ను కొత్త ప్రభుత్వం గత నెల 27న రద్దు చేసిన సంగతి తెలిసిందే.
తెలుగు వన్ఇండియా