ఆధార్ భద్రత కోసం వర్చ్యువల్ ఐడీ
భారత ప్రభుత్వం జనవరి 2009 లో ఆధార్ దేశం లో ప్రవేశపెట్టింది.ప్రస్తుతం దాదాపు 95 శతం మందికి పైగా ఆధార్ కలిగి ఉన్నారని గణాంకాలు వెల్లడించాయి.ఆధార్ అనేది ప్రతి భారత పౌరునికి చాల ముఖ్యమైనది
భారత ప్రభుత్వం జనవరి 2009 లో ఆధార్ దేశం లో ప్రవేశపెట్టింది.ప్రస్తుతం దాదాపు 95 శతం మందికి పైగా ఆధార్ కలిగి ఉన్నారని గణాంకాలు వెల్లడించాయి.ఆధార్ అనేది ప్రతి భారత పౌరునికి చాల ముఖ్యమైనది,ప్రస్తుతం మన దేశం లో చాల వాటికీ ఈ ఆధార్ ను ఉపయోగిస్తున్నారు.ఉదాహరణకి గ్యాస్ కనెక్షన్లకు,పాన్ కార్డు,ఆస్తుల కొనుగోలు కు మరియు అమ్మడానికి ఆధార్ తప్పని సరిగా ఉండాలి.ఫిబ్రవరి 6 లోగ ఆధార్ కు మొబైల్ నంబరును అనుసంధానం చేసుకోవాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.ఇదిలా ఉండగా ఆధార్ మీద ప్రజల్లో ఎన్నో సందేహాలు అపోహలు నెలకొన్నాయి.ప్రతి చిన్న వాటికీ ఆధార్ వివరాలు నమోదుచేస్తునారు,యిటీవలె ఒక పత్రికలో 500 రోపాయలకే ఆధార్ వివరాలు అమ్మేస్తున్నారని ఒక వార్త వెలువడిన సందర్భంలో భారత పవరుని పూర్తి వివరాలు అతి గోప్యాంగ ఉంచాల్సినవి తేలికగా బయట పడితే అది ప్రజలు స్వేచ్చకు భంగం కలుగుతుందని వాపోతున్న తరుణంలో భారత ప్రభుత్వం త్వరగా స్పందించింది.ఆధార్ భద్రత కోసం యుఐడిఎఐ వర్చ్యువల్ ఐడీ పరిమితి KYC కోడ్ అనే రెండంచెల భద్రతా వ్యవస్థను ప్రవేశపెట్టింది.ఆధార్ భద్రత కోసం వర్చ్యువల్ ఐడీ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం
వర్చ్యువల్ ఐడీ అంటే ఏమిటి ?
ఆధార్ లింక్ చేసినపుడు ఆధార్ నంబరుకు బదులుగా మరో నంబరు కనబడుతుంది.
అనగా ఆధార్ బాధలుగా వేరే ౧౬ నంబరుల అంకెలు డిస్ప్లే మీద కనపడుతాయి,దీన్నే వర్చ్యువల్ ఐడీ అంటారు.దీనివల్ల సదరు వ్యక్తి వివరాలు గోప్యాంగ ఉంటూ ఎవరికీ కనపుడే అవకాశం ఉండదు.ఈ విధానం జూన్ 1 నుండి అన్ని ఆధార్ సంస్థ ఏజెన్సీలో అమలవుతుంది.
ఇదెలా పనిచేస్తుంది?
యూజర్ యుఐడిఎఐ వెబ్సైటులోకి వెళ్లి వర్చ్యువల్ ఐడీ ని క్రెయేట్ చేసుకోవచ్చు.ఆధార్ 1.ఆధారిత సర్వీసు సెంట్రీలోకాని లేదా మొబైల్ ఎం-ఆధార్ యాప్ ద్వారా నమోదుచేసుకోవచ్చు.
2.యూజర్ తనకు కావలిసినన్ని వర్చ్యువల్ ఐడీ లు క్రీస్తే చేయొచ్చు.కొత్త ఐడీ ని క్రెయేట్ చేసి వాడకంలోకి రాగానే పాత ఐడీ ఆటోమేటిక్ గ కాన్సుల్ ఐపోతుంది.
3.వర్చ్యువల్ ఐడీ అనేది 16 అంకెల సంఖ్య కలిగి,యిది మీ ఆధార్ తో లింక్ చేయబడి ఉంటుంది.
4.16 అంకెల సంఖ్య కలిగి ఉన్న వర్చ్యువల్ ఐడీ చివరి అంకె మీ ఆధార్ నంబరుకు వెర్హఫ్ అల్గారిథమ్ ద్వారా తెలుసుకుంటుంది.ఈ వెర్హఫ్ అల్గారిథమును డచ్ గణిత శాస్త్రవేత్త జాకోబ్స్ వెర్హఫ్ 1969 లో డెవలప్ చేసాడు.
5.వర్చ్యువల్ ఐడీ ద్వారా మీ పేరు,ఫోటో,చిరునామా వంటి వివరాలు మాత్రమే తెలిసే అవకాశం ఉందని ఇంకే ఇతరత్రా వివరాలు తెలిసే ఆస్కారం ఉండదని తెలిపారు.
6.ఆధార్ అడిగే ప్రతిచోటా వర్చ్యువల్ ఐడీ లో ఉన్న సమాచారం సరిపోతుందని ఇంకే వివరాలు చెప్పనవసరం లేదన్నారు.
7.KYC లో ఆధార్ అడిగే గ్యాస్ మరియు మొబైల్ లాంటి ఏజెన్సీలకు వర్చ్యువల్ యిది లో ఉండే సమాచారం సరిపోయేలా ఆర్డినెన్స్ తీసుకురానుంది.
డూప్లికేట్ వర్చ్యువల్ ఐడీ క్రెయేట్ చేసే అవకాశం లేదని,మీ వర్చ్యువల్ ఐడీ కొంత కాలం తర్వాత ఆటోమాటిగ్గా డిజేబుల్ అవుతుందని,యూజర్ మరి కొత్త ఐడీ క్రెయేట్ చేసుకోవాలని సూచించారు.
ఆధార్ గురించి
యూఐడీఏఐ జారీ చేసే 12 అంకెల సంఖ్య ఆధార్. పలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు పీఎఫ్ఆర్డీఏ, ఆదాయపు పన్ను శాఖ వంటి నియంత్రణ సంస్థలు ఆధార్ అనుసంధానానికి ప్రయత్నిస్తున్నాయి. వివిధ రకాల సేవలను పౌరులు అందుకోవాలంటే ఆధార్ అనుసంధానం తప్పనిసరి. దీంతో పాటు వివిధ చోట్ల వ్యక్తిగత, చిరునామా గుర్తింపుగా ఉపయోగపడుతుంది. ఈ ఆధార్, ఆధార్ లెటర్ సైతం తగిన గుర్తింపు పత్రాలుగా పనికొస్తాయి.అప్పు తీసుకున్నారు.. తిరిగి కట్టకపోతే ఏమవుతుంది?