రిటైర్మెంట్ లేదా పెన్షన్ ఆధారిత బీమా పాలసీల వివరాలు
ప్రభుత్వ ఉద్యోగులకు జీవితాంతం పింఛను వచ్చేలా ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తుంది. కానీ చాలా ప్రయివేటు కంపెనీల్లో పదవీ విరమణ తర్వాత కచ్చితమైన పింఛను ఏర్పాట్లు ఉండకపోవచ్చు. ఒక నిర్ణీత వయస
ప్రభుత్వ ఉద్యోగులకు జీవితాంతం పింఛను వచ్చేలా ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తుంది. కానీ చాలా ప్రయివేటు కంపెనీల్లో పదవీ విరమణ తర్వాత కచ్చితమైన పింఛను ఏర్పాట్లు ఉండకపోవచ్చు. ఒక నిర్ణీత వయసు తర్వాత ఉద్యోగం మానేస్తే అతనికి నెలవారీ వేతనం, ఇతర ప్రయోజనాలు అందకపోవచ్చు. ఉద్యోగి అప్పటి వరకూ చేసిన పొదుపు, పెట్టుబడులపైన ఆధారపడాల్సి రావొచ్చు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ లేదా పెన్షన్ ఆధారిత బీమా పాలసీలు అలాంటి వారికి ఆధారమవుతాయి.
పింఛను పాలసీల్లో ఎండోమెంట్, యూనిట్ లింక్డ్ పాలసీలు అనే రెండు రకాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఇతర పాలసీల్లా కాకుండా ఉద్యోగం మానేసిన తర్వాత ఉపయోగపడే విధంగా ఇవి పనిచేస్తాయి. రిటైర్మెంట్ పాలసీల్లో సాధారణంగా రెండు దశలు ఉంటాయి. పాలసీ గడువు వరకు ప్రీమియం చెల్లిస్తూ నిధిని సమకూర్చుకోవడం. రెండో దశ గడువు తీరిన తర్వాత వచ్చే మొత్తాన్ని ఐఆర్డీఏ నిర్దేశించిన యాన్యుటీ పథకాలలో పెట్టుబడి పెట్టడం. దానిపై నెల నెలా వడ్డీ పెన్షన్ రూపంలో వస్తుంది. పాలసీ గడువు తీరిన తర్వాత సమకూరిన నిధి నుంచి 30 నుంచి 40 శాతం వరకే వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని కచ్చితంగా ఏదేనీ పెన్షన్ యాన్యుటీ ఫథకంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా సంప్రదాయ పాలసీల కంటే యూనిట్ ఆధారిత పాలసీల్లో ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది.