దేశంలో యూపీఐ పేమెంట్స్ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే యూపీఐ చెల్లింపులు ఎక్కువ శాతం ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్, భీమ్ యాప్స్ లో చేస్తారు. యూపీఐ యాప్స్ లో అత్యధికంగా ఫోన్ పే వాడుతుంటారు. ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ఫోన్ పే అనేక మార్పులు చేసింది. రీఛార్జీ చేసుకోవడం, డీటీహెచ్, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడం, మెట్రో టికెట్ బుక్, ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం, రుణాలు చెల్లించడం, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ఆప్షన్లను తీసుకొచ్చింది. అంతే కాదు ఇప్పుడు ఫోన్ పే ద్వారా రుణాలు తీసుకొచ్చు.

Advertisement

తాజాగా ఫోన్ పే మరో ఫీచర్ యాడ్ చేసింది. ఫోన్ పేలో రికరింగ్ డిపాజిట్, ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల భాగస్వామ్యంతో ఫోన్‌పే తమ యూజర్లకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అలాగే శివాలిక్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ భాగస్వామ్యంతో ఓ డిజిటల్‌ డైలీ రికరింగ్‌ డిపాజిట్‌ (ఆర్‌డీ) కూడా ఫేన్ పే తీసుకొచ్చింది. యూపీఐ ఆటోపే ద్వారా రోజుకు రూ.100-1,000 వరకు ఎంతైనా యూజర్లు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని గురువారం ఫోన్‌పే ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

ఫిక్స్‌డ్ డిపాజిట్ మార్కెట్‌ప్లేస్, ఫోన్‌పే యాప్‌లోనే పూర్తిగా డిజిటల్ గా అందుబాటులో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా, భాగస్వామ్య బ్యాంకులలో బుక్ చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) ద్వారా రూ. 5 లక్షల వరకు బీమా ఉంటుందని ఫోన్‌పే తెలిపింది.'డైలీ ఆర్డీ' ప్రోడక్ట్, పునరావృతమయ్యే రోజువారీ కాంట్రిబ్యూషన్లను బ్యాంక్ డిపాజిట్ భద్రతతో కలపడం ద్వారా, చిన్న మొత్తాల ఆటోమేటెడ్ పొదుపును ప్రోత్సహించడానికి రూపొందించారు. వినియోగదారులు ఏడు రోజుల తర్వాత నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు లేదా ఎప్పుడైనా UPI ఆటోపే డిలీట్ చేసుకోవచ్చు. రోజువారీ కాంట్రిబ్యూషన్లు మిస్ అయినందుకు ఈ ప్రోడక్ట్ ఎటువంటి జరిమానాలు లేకుండా 15 రోజుల గ్రేస్ పీరియడ్‌ను కూడా అందిస్తుంది.

Advertisement

"మా లక్ష్యం, ఆర్థిక సేవలకు సులభమైన ప్రాప్యతను కల్పించడం ద్వారా ప్రతి భారతీయుడి ఆర్థిక పురోగతిని వేగవంతం చేయడం. మా ఫిక్స్‌డ్ డిపాజిట్ పంపిణీని, డైలీ ఆర్డీ ఉత్పత్తితో పాటు ప్రారంభించడం ఆ దిశగా ఒక ముఖ్యమైన మైలురాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు భారతీయ గృహ పొదుపునకు మూలస్తంభంగా నిలుస్తూ, హామీతో కూడిన రాబడిని అందిస్తున్నాయి" అని ఫోన్‌పే వైస్ ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ పేమెంట్స్ దీప్ అగర్వాల్ అన్నారు. ఫోన్ పేను 2016లో స్థాపించారు. ఏప్రిల్ 2026 నాటికి తమకు 70 కోట్లకు పైగా నమోదిత వినియోగదారులు, 5 కోట్లకు పైగా వ్యాపారుల అంగీకార నెట్‌వర్క్ ఉందని కంపెనీ తెలిపింది.

Advertisement

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.