చాలా ప్రభుత్వ పథకాల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనర్హులను ఏరియాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే పలు సంస్కరణాలు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఈ కేవైసీ తీసుకొచ్చింది. ముఖ్యంగా గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలని సూచించింది. అర్హులైన గ్యాస్ వినియోగదారులను గుర్తించడంతో పాటు అర్హత లేని వారిని తొలగించేందుకు ఈ కేవైసీ ప్రక్రియ తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి చాలా మంది కస్టమర్లు ఈకేవైసీ చేసుకున్నారు. అయితే ఆ తర్వాత వినియోగదారుల నుంచి సరైనా స్పందన రాలేదు. దీంతో కంపెనీలు త్వరలోనే నిలిపివేసేందుకు నిర్ణయించినట్టు సమాచారం. ఒకవేళ అదే జరిగితే ఈ కేవైసీ చేసుకోని వారికి గ్యాస్ సరఫరా ఆగిపోయే అవకాశం ఉంటుందని డీలర్స్ హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 లక్షల కనెక్షన్లుండగా 70 శాతం మంది వినియోగదారులు మాత్రమే ఈ కేవైసీ చేసుకున్నట్లు డీలర్లు చెబుతున్నారు. మరోపక్క డిమాండ్ కు సరిపడా గ్యాస్ సరఫరా కాకపోవడంతో కొన్ని కంపెనీలు ఈ కేవైసీ సాకుతో సిలిండర్ల డెలివరీ నిలిపివేసే చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 2024 జూన్ లో వినియోగదారులు ఈ కేవైసీ చేసుకోవాలని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. ఇందుకు సంవత్సర కాలం పాటు సమయం ఇచ్చారు. ఆ తర్వాత నిరంతర ప్రక్రియ పేరుతో దీన్నీ కొనసాగిస్తున్నారు. అయినా వినియోగదారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని డీలర్లు చెబుతున్నారు.
2014లోనూ ఈకేవైసీ మొదలుపెట్టి ఐదు సంవత్సరాల పాటు కొనసాగించారు. ఈసారి మాత్రం సంవత్సరాల ముగించేలా ఉన్నారని డీలర్లు అంచనా వేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో టిఫిన్ సెంటర్లు, చిన్న చిన్నహోటళ్లు, స్ట్రీట్ వెండర్లు ఇలా చాలామంది కమర్షియల్ గ్యాస్ వినియోగించకుండా డొమెస్టిక్ సిలిండర్లను వాడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే ఇప్పటికీ గ్యాస్ ఈకేవైసీ చేసుకోనివారు ఎవరైనా ఉంటే వెంటనే చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ కేవైసీ చాలా సులభంగా చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆయా కంపెనీల యాప్ ల ద్వారా కానీ, డీలర్స్ వద్దకు వెళ్లి కానీ, డెలివరీ బాయ్స్ వచ్చినప్పుడు వారి ఫోన్లలో ఉండే యాప్ ద్వారా చేసుకోవచ్చని వివరిస్తున్నారు.
మరో పక్క రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. రేషన్ కార్డులో పేరు ఉన్న తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు. ఈకేవైసీ చేసుకునేందుకు జూలై 31 చివరి తేదీగా ఉంది. ఆ లోపు రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకోకుండా రేషన్ కార్డు కట్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రేషన్ కార్డు ఈకేవైసీ కోసం దగ్గరలో రేషన్ డీలర్ల వద్దకు వెళ్లి ఈకేవైసీ చేసుకోవచ్చని చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- Ration Card ekyc: రేషన్ కార్డు ఇకేవైసీ చేసుకున్నారా.. జూలై 31 చివరి గడువు..!
- గ్యాస్ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేయాల్సిందే.. కొత్త రూల్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం...ఎలా చేయాలంటే..
- LPG Cylinder eKYC: వంట గ్యాస్ ఇ కేవైసీపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..!
- PM Kisan: పీఎం కిసాన్ 14వ విడత ఎప్పుడంటే..!
- PM Kisan: రైతులకు శుభవార్త.. సెప్టెంబర్ 30లోపు ఖాతాల్లో పీఎం కిసాన్ 12వ విడత డబ్బులు..!
- PM Kisan: రైతులకు శుభవార్త.. రెండు వారాల్లో పీఎం కిసాన్ డబ్బులు జమా అయ్యే అవకాశం..