ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఎంతో చరిత్ర కలిగిన రామగిరి బంగారు గనులు దాదాపు 25 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరుచుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు ప్రారంభించింది. ఒకప్పుడు భారతదేశంలోనే అత్యంత ప్రధానమైన బంగారు ఉత్పాదక కేంద్రాలలో ఒకటిగా నిలిచిన రామగిరిలో.. 2000వ సంవత్సరంలో మైనింగ్ పనులు పూర్తిగా నిలిపివేశారు.
ఈ గనులను నిర్వహించిన భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (BGML) సంస్థకు 1982 నుండి 2002 వరకు ఇక్కడ మైనింగ్ లీజు ఉండేది. ప్రస్తుతం మారిన ఆర్థిక పరిస్థితులు, మైనింగ్ రంగంలో వచ్చిన అత్యాధునిక సాంకేతిక పురోగతి కారణంగా ఈ గనులను తిరిగి ప్రారంభించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని గనులు, భూగర్భశాస్త్ర విభాగం వెల్లడించింది.
గతంలో సాంకేతిక పరిమితుల వల్ల తక్కువ గ్రేడ్ ఉన్న నిక్షేపాల నుండి బంగారాన్ని వేరు చేయడం లాభదాయకం కాదని వదిలివేశారు. అయితే, ప్రస్తుత ఆధునిక ఖనిజ వెలికితీత పద్ధతుల ద్వారా అటువంటి నిక్షేపాల నుండి కూడా బంగారాన్ని సమర్థవంతంగా సేకరించడం సాధ్యమవుతుందని ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాల నివేదికపై పనిచేస్తున్న ఒక సీనియర్ అధికారి తెలిపారు. దీనికి తోడు, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు నిరంతరం రికార్డు స్థాయిలకు పెరుగుతుండటం వల్ల ఈ ప్రాజెక్టుకు వాణిజ్యపరంగా భారీ లాభదాయకత చేకూరనుంది.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం రామగిరి బంగారు పట్టీ దాదాపు 150 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇక్కడ టన్నుకు సగటున నాలుగు గ్రాముల బంగారం గ్రేడ్తో సుమారు 11.4 లక్షల టన్నుల ఖనిజ సంపద నిక్షిప్తమై ఉందని, దీని ద్వారా దాదాపు 9.1 టన్నుల బంగారాన్ని వెలికితీయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
జొన్నగిరి బంగారు గని గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు.. దీని ద్వారా ఏపీకి వచ్చే ఆదాయం ఎంతంటే..
ఏపీ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవల ఈ ప్రాంతంలో స్వయంగా పర్యటించి.. ప్రాజెక్టు పురోగతిపై ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షా సమావేశాలు రామగిరి పునరుద్ధరణపై స్థానిక ప్రజల్లో కొత్త ఆశలను రేకెత్తించాయి. ఇదిలా ఉండగా గతంలో ఇక్కడ జరిగిన మైనింగ్ సమయంలో పేరుకుపోయిన భారీ వ్యర్థాల డంపులను (Tailings) కూడా అధికారులు గుర్తించారు.
ప్రాథమిక సర్వేల అంచనా ప్రకారం ఈ వేస్ట్ డంపులలో దాదాపు 4.16 లక్షల టన్నులకు పైగా పదార్థం ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ వ్యర్థాలలో కూడా ఇంకా భారీ పరిమాణంలో బంగారం మిగిలి ఉండే అవకాశం ఉందని, ఆధునిక సాంకేతికతతో దానిని కూడా వెలికితీసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- Gold mine: ఏపీలో బయటపడ్డ బంగారు గని! ప్రతి ఏటా వెయ్యి కిలోల బంగారం! ఇకపై ధరలు తగ్గుతాయా?
- బంగారం కరువును తీర్చబోతున్న ఆంధ్రప్రదేశ్.. వచ్చే నెలలో జొన్నగిరి బంగారు గనుల తవ్వకం ప్రారంభం..
- gold: గోల్డ్ మార్కెట్లో ప్రకంపనలు! సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి! ఎంతంటే..
- మన పక్క దేశానికి భారీ జాక్పాట్! సముద్రం అడుగున ఆసియాలోనే అతిపెద్ద బంగారు నిధి!
- Gold: భూమి మీద ఉన్న బంగారం మొత్తం ఒకే ఫ్రేమ్లో చూడండి! అన్నీ వివరాలు ఒకే చోట!
- చైనాలో బయటపడ్డ అతిపెద్ద గోల్డ్ గని! ఎంత బంగారం దొరికిందంటే..