అంతర్జాతీయంగా లభించిన సానుకూల సంకేతాలతో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాల బాట పట్టాయి. ఇరాన్‌తో చర్చలు ప్రారంభించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. ద్రవ్యోల్బణ భయాలు తగ్గడంతో ఇది దలాల్ స్ట్రీట్‌లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ఒక్కసారిగా బలపరిచింది.

Advertisement

ట్రేడింగ్ ప్రారంభం నుంచే సూచీల్లో కొనుగోళ్ల జోరు స్పష్టంగా కనిపించింది. ఉదయం 11:00 గంటల సమయానికి ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 203.35 పాయింట్లు (0.83 శాతం) లాభపడి 24,586.95 వద్ద ట్రేడవ్వగా, బిఎస్ఈ సెన్సెక్స్ 613.65 పాయింట్లు (0.79 శాతం) పెరుగుదలతో 78,708.29 పాయింట్ల వద్ద కొనసాగింది. ప్రధాన సూచీలతో పాటు విస్తృత మార్కెట్ (Broad Market) కూడా రాణించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.97 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 1.17 శాతం చొప్పున గైన్స్ నమోదు చేశాయి.

Advertisement

ప్రధాన రంగాలు, షేర్ల పనితీరును పరిశీలిస్తే.. నిఫ్టీ 50లో ఐటీసీ (ITC), ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో), బజాజ్ ఫైనాన్స్ కంపెనీలు టాప్ గెయినర్లుగా నిలిచాయి. రంగాలు వారీగా నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ మెటల్ అత్యుత్తమ ప్రదర్శన కనబరచగా, నిఫ్టీ మీడియా రరంగం మాత్రం కాస్త మందకొడిగా సాగింది.

మార్కెట్ గమనంపై యాక్సిస్ డైరెక్ట్ రీసెర్చ్ హెడ్ రాజేష్ పాల్వియా మాట్లాడుతూ.. నిఫ్టీకి 24,250 వద్ద బలమైన మద్దతు (Support Level) లభిస్తోందని, ఈ స్థాయి పైన ఉన్నంత కాలం మార్కెట్ ట్రెండ్ సానుకూలంగానే ఉంటుందని తెలిపారు. ఒకవేళ ఈ మద్దతు స్థాయి దిగువకు పడిపోతే.. నిఫ్టీ 24,100 వరకు క్షీణించే అవకాశం ఉందన్నారు. పై స్థాయిలో నిఫ్టీకి 24,550 వద్ద మొదటి రెసిస్టెన్స్ ఎదురవుతుందని, ఆ తర్వాత 200-రోజుల మూవింగ్ యావరేజ్ (200-DMA) అయిన 24,780 అత్యంత కీలకమైన నిరోధక స్థాయిగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు.. ఇన్వెస్టర్లను కలవరపెడుతున్న పశ్చిమాసియా వార్..

కార్పొరేట్ రంగంలో ఏప్రిల్-జూన్ త్రైమాసిక (Q1) ఫలితాల సందడి కొనసాగుతోంది. ఈరోజు CAMS, ఎస్కార్ట్స్ కుబోటా, గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్, గ్లాక్సోస్మిత్‌క్లైన్ ఫార్మా, JM ఫైనాన్షియల్, కన్సాయి నెరోలాక్ పెయింట్స్, KEI ఇండస్ట్రీస్, శ్రీ లోటస్ డెవలపర్స్, NOCIL, సనాతన్ టెక్స్‌టైల్స్, స్టోవ్ క్రాఫ్ట్, థామస్ కుక్ (ఇండియా) వంటి ప్రధాన కంపెనీలు తమ ఆర్థిక గణాంకాలను విడుదల చేయనున్నాయి.

ప్రైమరీ మార్కెట్‌లోనూ ప్రాథమిక పబ్లిక్ ఆఫర్ల (IPO) పరంపర కొనసాగుతోంది. రూ. 177.81 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో 'అనవిల్ వైర్ & ఇంజనీరింగ్' ఐపీఓ ఈరోజు సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకుంది. మరొకవైపు జీవీ ఎలక్ట్రికల్స్, ఫ్యూజన్ క్లాస్‌రూమ్ ఎడ్యుటెక్ ఐపీఓలు రెండవ రోజు బిడ్డింగ్ జరుపుకుంటుండగా, ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్, జూనిపర్ గ్రీన్ ఎనర్జీ, ధవల్ ప్యాకేజింగ్ మరియు వన్ఇండిగ్ టెక్నాలజీస్ ఐపీఓలు చివరి దశకు చేరుకున్నాయి. కాగా, మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్‌ ఐపీఓ దరఖాస్తుదారులు తమ కేటాయింపుల (Allotment) స్థితిని పరిశీలించుకునే ప్రక్రియ ప్రారంభమైంది.

Advertisement

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.