కొత్త క్లోజింగ్ ఆక్షన్ సెషన్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత, సోమవారం సెషన్ చివర్లో ఊపందుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 మంగళవారం సెషన్లో తీవ్ర నష్టాలను చవిచూశాయి.
దీంతో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న మార్కెట్ లాభాల పరంపరకు బ్రేక్ పడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు తీవ్ర అప్రమత్తత వహించడం.. లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 210.08 పాయింట్లు క్షీణించి 78,428.95 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 159.40 పాయింట్లు పడిపోయి 24,614.90 వద్ద స్థిరపడింది.
ట్రేడింగ్ సెషన్ అంతటా బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఐటీ స్టాక్లు తీవ్ర ఒత్తిడిలోనే కొనసాగాయి. ఈ రంగాలు మార్కెట్ సూచీలలో ఎక్కువ వెయిటేజీ కలిగి ఉండటం వల్ల వాటిలో వచ్చిన అమ్మకాల ఒత్తిడి సూచీల పతనానికి కారణమైంది. ఆర్బిఐ ద్రవ్య సమీక్ష కోసం ఎదురుచూస్తున్న పెద్ద పెట్టుబడిదారులు కొత్తగా నిధులు కేటాయించే కంటే వేచి చూసే ధోరణికే మొగ్గు చూపారు.
రంగాల వారీగా పరిశీలిస్తే నిఫ్టీ రియల్టీ అత్యధికంగా రెండు శాతానికి పైగా నష్టపోయి అత్యంత బలహీనమైన విభాగంగా నిలిచింది. దీంతో పాటు ఐటీ, సిమెంట్, ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంకింగ్, ఫార్మా, హెల్త్కేర్ రంగాలు కూడా బలహీనంగా ముగిశాయి. నిఫ్టీ 50 జాబితాలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, హిందుస్తాన్ యూనిలీవర్ షేర్లు అత్యధిక నష్టాలను మూటగట్టుకున్నాయి.
విస్తృత మార్కెట్ అంతటా అమ్మకాల వాతావరణం ఉన్నప్పటికీ, కెమికల్ రంగానికి చెందిన స్టాక్లు స్థిరత్వాన్ని ప్రదర్శించాయి. కాగా మెటల్ రంగం మాత్రమే లాభాలను నమోదు చేసి, ఈ ప్రతికూల మార్కెట్లో ఏకైక సానుకూల విభాగంగా నిలిచింది. చిన్న, మధ్యతరహా కంపెనీల సూచీలు మిశ్రమ పనితీరును కనబరిచాయి.
స్టాక్ మార్కెట్ టుడే.. RBI నిర్ణయానికి ముందు అలర్ట్ అయిన ఇన్వెస్టర్లు.. లాభనష్టాల మధ్య సెన్సెక్స్, నిఫ్టీ..
నిఫ్టీ మిడ్క్యాప్ 100 సూచీ 0.29 శాతం నష్టంతో ముగియగా, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 సూచీ మాత్రం 0.23 శాతం కొద్దిపాటి లాభాన్ని సాధించింది. కొత్త సీఏఎస్ విధానం అమల్లోకి రావడం, ఆర్బీఐ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడనుండటంతో రాబోయే రోజుల్లో మార్కెట్ మరింత ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- క్లోజింగ్ ఆక్షన్ సెషన్ అంటే ఏమిటి.. నిఫ్టీ పతనమైతే.. సెన్సెక్స్ ఎందుకు పెరుగుతోంది..
- పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. ఈ కంపెనీ స్టాక్ మీద ఓ కన్నేసి ఉంచండి.. రూ. 15 వేల కోట్ల ఆర్డర్ వచ్చింది..
- Multibagger Stock: ఐదేళ్లలో 3,250 శాతం రాబడి ఇచ్చిన డిఫెన్స్ స్టాక్ ఇదే..!
- 20 నిమిషాల్లో 26 లక్షల షేర్లు అమ్మకం.. కుప్పకూలిన రూ.49 వేల కోట్ల విలువైన కంపెనీ షేర్లు.. కారణం ఇదే..
- స్టాక్ మార్కెట్ టుడే.. RBI నిర్ణయానికి ముందు అలర్ట్ అయిన ఇన్వెస్టర్లు.. లాభనష్టాల మధ్య సెన్సెక్స్, నిఫ్టీ..
- ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్.. స్టాక్ మార్కెట్ క్లోజ్ టైమ్ మారింది.. కొత్తగా క్లోజింగ్ ఆక్షన్ సెషన్ అమల్లోకి..