దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడవ ట్రేడింగ్ సెషన్లో కూడా తన భారీ పతన ధోరణిని కొనసాగించింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు అమెరికా విధించనున్న సుంకాల భయాలు తోడవడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళనలు తీవ్రమయ్యాయి. దీని ప్రభావం స్టాక్ మార్కెట్ సెంటిమెంట్పై స్పష్టంగా పడింది. ముఖ్యంగా రియల్టీ, పీఎస్యూ బ్యాంకింగ్, లార్జ్-క్యాప్ ఐటీ స్టాక్లలో భారీగా అమ్మకాలు జరగడంతో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.
ఈ ట్రేడింగ్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా నిఫ్టీ 50 కీలకమైన 24,000 మార్కు కంటే దిగువకు జారి.. 191 పాయింట్లు (0.79%) నష్టంతో 23,996 వద్ద ముగిసింది. బిఎస్ఈ సెన్సెక్స్ కూడా 715 పాయింట్లు (0.92%) నష్టపోయి 76,755 వద్ద స్థిరపడింది. ఇక బ్యాంకింగ్, మిడ్-క్యాప్ సూచీలు కూడా ఈ ఒత్తిడి నుంచి మినహాయింపు పొందలేదు. నిఫ్టీ బ్యాంక్ 709 పాయింట్లు పడిపోయి 57,127 వద్దకు చేరగా, మిడ్-క్యాప్ ఇండెక్స్ 687 పాయింట్లు క్షీణించి 62,301 వద్ద ముగిసింది. మార్కెట్లో పెరుగుతున్న ప్రతీ రెండు షేర్లకు గాను ఐదు షేర్లు నష్టపోతున్నాయి. నిఫ్టీ 50లోని దాదాపు 40 స్టాక్స్ నష్టాల్లోనే ముగిశాయి.
మార్కెట్ కోలుకోకపోవడానికి ప్రధాన కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐటీ రంగానికి చెందిన భారీ వెయిటేజ్ స్టాక్స్లో తీవ్రమైన అమ్మకాలు సాగడమేనని చెప్పవచ్చు. ఇండిగో సంస్థ ముడిచమురు ధరల పెరుగుదల వల్ల పెరిగే ఇంధన ఖర్చుల భయంతో నిఫ్టీలోనే అత్యధిక నష్టాన్ని నమోదు చేసింది. అలాగే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జెనరిక్ మందులపై భవిష్యత్తులో భారీ టారిఫ్లు విధిస్తామన్న ప్రకటనతో లూపిన్, అరవిందో ఫార్మా వంటి భారతీయ ఫార్మా కంపెనీలు భయాందోళనకు గురై ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. ట్రంప్ దెబ్బకు ఫార్మా రంగం విలవిల.. ఎంతలా అంటే..
ఇతర కంపెనీల్లో చూస్తే, బిపిసిఎల్ త్రైమాసికంలో నష్టాలను ప్రకటించడంతో పాటు బంధన్ బ్యాంక్ తన ఆస్తుల రాబడి (ROA) మార్గదర్శకాలను తగ్గించడం వల్ల దాని షేరు ఏకంగా 17 శాతం వరకు కుప్పకూలింది. బైబ్యాక్ నిర్ణయాన్ని వాయిదా వేయడంతో టిప్స్ మ్యూజిక్ 12 శాతం నష్టపోగా, ఫలితాల ఒత్తిడితో మహీంద్రా హాలిడేస్, అదానీ గ్రీన్, అదానీ పవర్ వంటి షేర్లు కూడా పడిపోయాయి.
ఇలాంటి ప్రతికూల, నిరాశాజనక మార్కెట్ పరిస్థితుల్లో కూడా కొన్ని కంపెనీలు అద్భుతమైన ప్రతిభను కనబరిచాయి. మెరుగైన త్రైమాసిక ఫలితాలు, పెరిగిన ఎగుమతుల అంచనాల వల్ల టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో వంటి ఆటో స్టాక్లు కొనుగోళ్ల మద్దతును పొంది లాభాల్లో ముగిశాయి. నెస్లే ఇండియా నాలుగు విభాగాల్లోనూ అంచనాలను మించి రాణించడంతో పాటు లాభం రూ. 975 కోట్లకు పెరగడంతో ఆ షేరు 3 శాతం వరకు పుంజుకుంది.
ఎటర్నల్ కూడా తన భవిష్యత్ వ్యాపార దృక్పథంపై యాజమాన్యం వ్యక్తం చేసిన విశ్వాసంతో మళ్ళీ కోలుకోగా.. కళ్యాణ్ జ్యువెలర్స్ తన వరుస ర్యాలీని కొనసాగిస్తూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. మొత్తంమీద చూసినట్లయితే భవిష్యత్ అంచనాలు సరిగ్గా లేని కంపెనీలను మార్కెట్ కనికరం లేకుండా పక్కనబెడుతూ.. బలమైన ఫలితాలు సాధించిన కంపెనీలకు మాత్రమే ఆదరణ లభిస్తుందని ఈ ట్రేడింగ్ స్పష్టం చేసింది.
More Articles
- అమెరికా ఆర్థిక లోటుపై భయాలు.. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ సహా ఐటీ స్టాక్స్ ఢమాల్..
- స్టాక్ మార్కెట్ క్రాష్.. తుడిచిపెట్టుకుపోయిన లక్షల కోట్లు.. వెంటాడుతున్న సుంకాలు, ద్రవ్యోల్బణ భయాలు
- ఈ షేర్స్ పై మీరు ఓ లుక్కేయండి.. ఇన్వెస్టర్లకి లాభాలు కురిపిస్తున్న స్టాక్స్..
- స్టాక్ మార్కెట్ కళకళ! దూసుకెళ్తున్న సెన్సెక్స్, నిఫ్టీ.. సుంకాల భయాలు విడినట్టేనా..!
- షేర్ మార్కెట్ క్రాష్: తుడిచిపెట్టుకుపోయిన లక్షల కోట్లు ... సెన్సెక్స్ 750points డౌన్..
- అమెరికా-భారత్ డీల్.. స్టాక్ మార్కెట్ ఎందుకు అంతగా పడిపోయింది.. కుప్పకూలిన స్టాక్స్..