లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కేంద్ర తన వాటాను కొంత మేర విక్రయించనుంది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఎల్ఐసీలో గరిష్టంగా 6.5% వాటాను, ఒక్కో షేరుకు రూ.382 కనీసవద్ద విక్రయించనున్నట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. నాన్-రీటైల్ ఇన్వెస్టర్ల కోసం సబ్‌స్క్రిప్షన్ మొదలైన తర్వాత మంగళవారం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) షేర్లు 8.5 శాతం వరకు పడిపోయాయి. మంగళవారం ఉదయం 11 గంటల సమయానికి,అమ్మకానికి ఉంచిన మొత్తం షేర్లలో 29% మేర సబ్‌స్క్రిప్షన్ నమోదైంది. ఈ OFS ద్వారా, ఒక్కో షేరుకు రూ.382 కనీస ధర (ఫ్లోర్ ప్రైస్) వద్ద 6.5% వరకు వాటాను విక్రయించనున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.

Advertisement

బీఎస్ఈలో సోమవారం నాటి ఎల్ఐసీ షేర్ల ముగింపు ధర రూ.424.35తో పోలిస్తే ఫ్లోర్ ప్రైస్ 10 శాతం తక్కువగా ఉంది. ఒకవేళ ఈ ఆఫర్ పూర్తిగా సబ్‌స్క్రయిబ్ అయితే, నిర్ణీత కనీస ధర వద్ద 8.22 కోట్ల షేర్లు లేదా 6.5% వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.31,000 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఈ ఓఎఫ్ఎస్ లో ఎల్ఐసీ ఈక్విటీలో 2.5 శాతం ప్రాథమిక ఆఫర్‌తో పాటు, అధిక డిమాండ్ ఉంటే అదనంగా మరో 4 శాతం వాటాను విక్రయించే 'గ్రీన్ షూ ఆప్షన్' కూడా ఉందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (DIPAM) పేర్కొంది.

Advertisement

ఈ ఓఎఫ్ఎస్ ద్వారా మంగళవారం నాడు నాన్-రీటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరుచుకోగా, రీటైల్ ఇన్వెస్టర్లు బుధవారం నాడు బిడ్లు వేయవచ్చు. ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం 'కనీస పబ్లిక్ వాటా' లక్ష్యాలను నిర్ణీత గడువు కంటే ముందే చేరుకోవడానికి వీలవుతుందని DIPAM కార్యదర్శి అరుణిష్ చావ్లా తెలిపారు.గతంలో మే 2022లో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా ఒక్కో షేరుకు రూ.902-949 ధరల శ్రేణిలో 3.5% వాటాను విక్రయించిన ప్రభుత్వం సుమారు రూ.21,000 కోట్లను సమీకరించింది. ప్రస్తుతం ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.36 లక్షల కోట్లకు పైగా ఉంది.

Advertisement

సోమవారం నాడు బీఎస్ఈలో LIC షేర్లు మునుపటి ముగింపు ధరతో పోలిస్తే 0.12% తగ్గి రూ.424.35 వద్ద స్థిరపడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు, ఏడు ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 21,082 కోట్లను సమీకరించింది. ప్రస్తుతం భారత ప్రభుత్వానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో 96.5% వాటా ఉంది. ఈ ఆఫర్ ఫర్ సేల్ ప్రక్రియ తర్వాత, ఈ వాటా 90%కి తగ్గుతుందని అంచనా. కనీస పబ్లిక్ వాటా (MPS) నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ వాటాను 90 శాతానికి తగ్గించుకోవడానికి సెబీ) సంస్థ LICకి మే 2027 వరకు గడువు ఇచ్చింది.

Advertisement

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.