For Quick Alerts
For Daily Alerts
ఎన్పీఎస్ ఖాతా తెరిచేందుకు ఆధార్ ఉంటే చాలు
జాతీయ పింఛన్ పథకం(ఎన్పీఎస్)లో చేరేందుకు ఉన్న నిబంధనలను కేంద్రం సడలించింది. ఎన్పీఎస్ ఖాతాలు తెరవడానికి ఇదివరకు ఉన్న నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ పింఛన్ నిధులు నియంత్రణ,అభివృధ్ధి మండలి (పీఎఫ్ఆర
|
జాతీయ పింఛన్ పథకం(ఎన్పీఎస్)లో చేరేందుకు ఉన్న నిబంధనలను కేంద్రం సడలించింది. ఎన్పీఎస్ ఖాతాలు తెరవడానికి ఇదివరకు ఉన్న నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ పింఛన్ నిధులు నియంత్రణ,అభివృధ్ధి మండలి (పీఎఫ్ఆర్డీఏ) నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆధార్తో తెరిచిన ఫింఛను ఖాతాలకు బ్యాంక్ల్లో ఫిజికల్ అప్లికేషన్ ఫామ్ ఇవ్వవలసిన అవసరం లేదంటూ ఆదివారం ప్రకటించింది.
ఇదివరకు ఖాతాలు ప్రారంభించిన వాళ్లు ఎలక్ట్రానిక్ సంతకం చేయడానికి బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సి వచ్చేది. ఆన్లైన్ ఖాతా తెరిచేందుకు పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్(పీవోపీ)లో ఈ-సంతకాన్ని సమీకృతం చేస్తే అప్పుడు కేంద్రీకృత రికార్డుల(సీఆర్ఏ) నమోదు సంస్థకు చందాదారులు దరఖాస్తులు పోస్టులో పంపే అవసరం ఇకపై ఉండదని ప్రభుత్వం వివరించింది. దీని వల్ల ఆధార్ కలిగిన చందాదారులు సులువుగా పింఛను పథకంలో చేరగలుగుతారని తెలిపింది. ఈ-సంతకం సంబంధిత సేవలు అందించడానికి పీవోపీలు గరిష్టంగా రూ. 5 సేవా రుసుము వసూలు చేసుకోవచ్చని పీఎఫ్ఆర్డీఏ పేర్కొంది. నవంబరు 30 నాటికి ఈ పథకంలో 1 కోటి 40 లక్షల మంది చందాదారులుగా ఉన్నారు.
Comments
English summary
ఎన్పీఎస్ ఖాతా తెరిచేందుకు ఆధార్ ఉంటే చాలు | Now you can open a NPS account completely through Aadhar via Online
Story first published: Tuesday, January 3, 2017, 10:10 [IST]