For Quick Alerts
For Daily Alerts
బంగారు బాండ్లపై ప్రభుత్వ ఆఫర్లు
ప్రభుత్వం ఈ దఫా ఆరోసారి బంగారు బాండ్లను అందుబాటులోకి తెచ్చింది. వీటి కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఈసారి ఒక గ్రాముపై 50 రూపాయల రాయితీని ఇవ్వాలని నిర్ణయించారు.
|
ప్రభుత్వం ఈ దఫా ఆరోసారి బంగారు బాండ్లను అందుబాటులోకి తెచ్చింది. వీటి కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఈసారి ఒక గ్రాముపై 50 రూపాయల రాయితీని ఇవ్వాలని నిర్ణయించారు. అక్టోబర్ 17-21 తేదీ మధ్య భారత బులియన్, జువెలర్స్ అసోసియేషన్ ప్రకటించిన ధరల సగటును లెక్కిస్తే గ్రాము బంగారం ధర 3,007 రూపాయలుగా ఉంది. అయితే దీనికి బదులు ప్రభుత్వం 50 రూపాయల రాయితీ తర్వాత గ్రాము బాండ్ విలువను 2,957 రూపాయలుగా నిర్ణయించారు. ఈ బాండ్ల సబ్స్ర్కిప్షన్ ఈ నెల 24వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. నవంబర్ 17న బాండ్లను జారీ చేస్తారు.
భౌతిక రూపంలో బంగారానికి(బంగారు ఆభరణాలు,కడ్డీలు) ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్లో దీన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు ఐదు విడతల్లో ఈ బాండ్లను జారీ చేశారు. ప్రభుత్వం తరఫున రిజర్వు బ్యాంకు వీటిని జారీ చేస్తోంది.
ఇది కూడా చదవండి బంగారంపై పెట్టుబడులు ఇలా..
ప్రత్యేక ఫీచర్లు
- ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి 500 గ్రాముల వరకూ ఉంది.
- కనీస పెట్టుబడి 2 గ్రాముల నుంచి మొదలవుతోంది.
- డీమ్యాట్, పేపర్ సర్టిఫికెట్ల రూపంలో అందుబాటులో ఉంది.
- స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడ్ చేయవచ్చు.
- నిర్ణీత కాలంలో పరిమిత వడ్డీ వస్తుంది.
- బాండు కాలపరిమితి 8 ఏళ్లు.
- 5,6,7 ఏళ్ల నుంచి పథకంలో నుంచి వైదొలగవచ్చు.
- రుణాలకు హామీగా(తనఖా) వీటిని వాడుకోవచ్చు.
- బాండ్ల కోసం చెల్లింపులను చెక్కు,డ్రాఫ్ట్ లేదా ఆన్లైన్ ద్వారా చేయవచ్చు.
- 18001800000 టోల్ఫ్రీ నంబరులో మరింత సమాచారం తెలుసుకోవచ్చు.
Comments
English summary