ఆగస్టు నుంచి ఇంట్లో కూర్చోనే పీఎఫ్ విత్ డ్రా (ఫోటోలు)
పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ను (భవిష్య నిధి) ఆల్లైన్ ద్వారా విత్ డ్రా చేసుకునే వెసులుబాటును ఈపీఎఫ్ఓ ఆగస్టు నుంచి కల్పించనుంది. దీంతో పీఎఫ్ కార్యాలయంలో పేపర్ వర్క్ కూడా తగ్గుతుంది. వినియోగదారులకు ఇబ్బందులు లేని సేవలు లభిస్తాయి.
ఈ కొత్త విధానం ద్వారా ఆగస్టు నుంచి పీఎఫ్ను కొన్ని గంటల్లోనే విత్ డ్రా చేసుకోవచ్చని ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) అధికారి ఒకరు తెలిపారు. పీఎఫ్ రికార్డులను ఒరాకిల్ సాప్ట్వేర్ ద్వారా డిజిటలైజేషన్ చేశామని తెలిపారు.
"మరో నాలుగు నెలల్లో ఆన్లైన్ సౌకర్యం ప్రారంభంకానుంది. వీటిని ప్రాసెస్ చేసేందుకు ఒరాకిల్ ఆపరేటింగ్ సిస్టమ్ను వాడుతున్నాం. త్వరలోనే గుర్గావ్, ఢిల్లీ, సికింద్రాబాద్లలోని పీఎఫ్ సెంట్రల్ డేటా సెంటర్లలో సర్వర్ల ఏర్పాటు పూర్తవుతుంది. ఈ మూడింటితో దేశవ్యాప్తంగా ఉన్న 123 ఈపీఎఫ్ఓ కార్యాలయాలను అనుసంధానం చేస్తాం" అని వివరించారు.
జూన్లో సర్వర్లను పరీక్షిస్తామని, ఆపై కొన్ని రోజులు పైలెట్ ప్రాజెక్టుగా ఇది అమలవుతుందన్నారు. ప్రస్తుతం పీఎఫ్ ఖాతాదారులు పీఎఫ్ ఆకౌంట్ను సెటిల్ చేసుకునేందుకు పీఎఫ్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. అదే ఆన్లైన్ సెటిల్మెంట్ కోసం వినియోగదారులకు సార్వత్రిక ఖాతా నెంబర్ ఇస్తారు.
వినియోగదారులు పీఎఫ్ చెల్లింపుల కోసం ఆన్లైన్లో అప్లే చేసుకోగానే డబ్బులను వాళ్ల బ్యాంకు ఖాతాలోకి మళ్లిస్తారు. దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన అధునాతన టెక్నాలజీని అందుకుని మరింత పారదర్శకంగా, వేగంగా ఖాతాదారులకు సేవలందించాలని భావించిన ఈపీఎఫ్ఓ, ఆన్ లైన్ నిర్ణయాన్ని గత సంవత్సరమే ప్రకటించింది.
కాగా, ఆన్లైన్లో పీఎఫ్ను అప్లై చేసేమందు, తమ బ్యాంకు ఖాతాలను, ఆధార్, పాన్ కార్డు సంఖ్యలు తదితర కేవైసీ వివరాలను తొలుత పీఎఫ్ ఆఫీసులకు అందించాల్సి వుంటుంది. ఈపీఎఫ్ఓకు ప్రస్తుతం 5 కోట్లకు పైగా ఖాదారులున్నారు.
ఆగస్టు నుంచి ఇంట్లో కూర్చోనే పీఎఫ్ విత్ డ్రా
పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ను (భవిష్య నిధి) ఆల్లైన్ ద్వారా విత్ డ్రా చేసుకునే వెసులుబాటును ఈపీఎఫ్ఓ ఆగస్టు నుంచి కల్పించనుంది. దీంతో పీఎఫ్ కార్యాలయంలో పేపర్ వర్క్ కూడా తగ్గుతుంది. వినియోగదారులకు ఇబ్బందులు లేని సేవలు లభిస్తాయి.
ఆగస్టు నుంచి ఇంట్లో కూర్చోనే పీఎఫ్ విత్ డ్రా
ఈ కొత్త విధానం ద్వారా ఆగస్టు నుంచి పీఎఫ్ను కొన్ని గంటల్లోనే విత్ డ్రా చేసుకోవచ్చని ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) అధికారి ఒకరు తెలిపారు. పీఎఫ్ రికార్డులను ఒరాకిల్ సాప్ట్వేర్ ద్వారా డిజిటలైజేషన్ చేశామని తెలిపారు.
ఆగస్టు నుంచి ఇంట్లో కూర్చోనే పీఎఫ్ విత్ డ్రా
"మరో నాలుగు నెలల్లో ఆన్లైన్ సౌకర్యం ప్రారంభంకానుంది. వీటిని ప్రాసెస్ చేసేందుకు ఒరాకిల్ ఆపరేటింగ్ సిస్టమ్ను వాడుతున్నాం. త్వరలోనే గుర్గావ్, ఢిల్లీ, సికింద్రాబాద్లలోని పీఎఫ్ సెంట్రల్ డేటా సెంటర్లలో సర్వర్ల ఏర్పాటు పూర్తవుతుంది. ఈ మూడింటితో దేశవ్యాప్తంగా ఉన్న 123 ఈపీఎఫ్ఓ కార్యాలయాలను అనుసంధానం చేస్తాం" అని వివరించారు.
ఆగస్టు నుంచి ఇంట్లో కూర్చోనే పీఎఫ్ విత్ డ్రా
జూన్లో సర్వర్లను పరీక్షిస్తామని, ఆపై కొన్ని రోజులు పైలెట్ ప్రాజెక్టుగా ఇది అమలవుతుందన్నారు. ప్రస్తుతం పీఎఫ్ ఖాతాదారులు పీఎఫ్ ఆకౌంట్ను సెటిల్ చేసుకునేందుకు పీఎఫ్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. అదే ఆన్లైన్ సెటిల్మెంట్ కోసం వినియోగదారులకు సార్వత్రిక ఖాతా నెంబర్ ఇస్తారు.
ఆగస్టు నుంచి ఇంట్లో కూర్చోనే పీఎఫ్ విత్ డ్రా
వినియోగదారులు పీఎఫ్ చెల్లింపుల కోసం ఆన్లైన్లో అప్లే చేసుకోగానే డబ్బులను వాళ్ల బ్యాంకు ఖాతాలోకి మళ్లిస్తారు. దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన అధునాతన టెక్నాలజీని అందుకుని మరింత పారదర్శకంగా, వేగంగా ఖాతాదారులకు సేవలందించాలని భావించిన ఈపీఎఫ్ఓ, ఆన్ లైన్ నిర్ణయాన్ని గత సంవత్సరమే ప్రకటించింది.
ఆగస్టు నుంచి ఇంట్లో కూర్చోనే పీఎఫ్ విత్ డ్రా
కాగా, ఆన్లైన్లో పీఎఫ్ను అప్లై చేసేమందు, తమ బ్యాంకు ఖాతాలను, ఆధార్, పాన్ కార్డు సంఖ్యలు తదితర కేవైసీ వివరాలను తొలుత పీఎఫ్ ఆఫీసులకు అందించాల్సి వుంటుంది. ఈపీఎఫ్ఓకు ప్రస్తుతం 5 కోట్లకు పైగా ఖాదారులున్నారు.