యాక్సిస్ బ్యాంకు చేతికి ఫ్రీచార్జ్
స్నాప్డీల్కు చెందిన డిజిటల్ చెల్లింపుల విభాగం ఫ్రీఛార్జ్ను యాక్సిస్ బ్యాంకు కొనుగోలు చేస్తుందని ఆ బ్యాంకు సిఇఒ శిఖా శర్మ స్పష్టం చేశారు. రూ.385 కోట్లకు దీన్ని స్వాధీనం చేసుకోబోతున్నామన్నారు.
స్నాప్డీల్కు చెందిన డిజిటల్ చెల్లింపుల విభాగం ఫ్రీఛార్జ్ను యాక్సిస్ బ్యాంకు కొనుగోలు చేస్తుందని ఆ బ్యాంకు సిఇఒ శిఖా శర్మ స్పష్టం చేశారు. రూ.385 కోట్లకు దీన్ని స్వాధీనం చేసుకోబోతున్నామన్నారు. ఈ కొనుగోలు ఒప్పందంపై గురువారం సంతకాలు జరిగాయని పేర్కొన్నారు. బ్యాంకు వ్యూహాత్మక ముందడుగుకు ఇది దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఫ్రీఛార్జ్ ఆదాయం రూ.80కోట్లుగా ఉందని యాక్సిస్ బ్యాంకు ఛీప్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జైరామ్ శ్రీధరన్ వెల్లడించారు. కాగా స్నాప్డీల్ తన వ్యాపారాన్ని సుమారుగా రూ.6000 కోట్లకు ఫ్లిప్కార్ట్కు విక్రయిస్తోన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఫ్రీచార్జ్ సంస్థను యాక్సిస్ బ్యాంక్ సొంతం చేసుకోవడం మూలంగా ఈ-కామర్స్ సంస్థగా ఎదిగేందుకు ఫ్రీచార్జ్కు అవకాశం లభిస్తుందని స్నాప్డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బాల్ తెలిపారు. బ్యాకింగ్ రంగం, డిజిటల్ చెల్లింపుల్లో యాక్సిస్-ఫ్రీచార్జ్ భాగస్వామ్యం కొత్త ఒరవడిని సృష్టిస్తుందని స్నాప్డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బాల్ చెప్పారు.