For Quick Alerts
For Daily Alerts
మూడో వరుస త్రైమాసికంలోనూ ఐడియాకు నష్టాలే...
దేశంలో మూడో అతిపెద్ద టెలికాం సంస్థ ఐడియా వరుసగా మూడో త్రైమాసికంలోనూ నష్టాలను చవిచూసింది. రిలయన్స్ జియో నుంచి తీవ్ర పోటీ నేపథ్యంలో టెలికాం సంస్థలన్నీ నష్టాలను మూటగట్టుకున్న సంగతి తెలిసిం
|
దేశంలో మూడో అతిపెద్ద టెలికాం సంస్థ ఐడియా వరుసగా మూడో త్రైమాసికంలోనూ నష్టాలను చవిచూసింది. రిలయన్స్ జియో నుంచి తీవ్ర పోటీ నేపథ్యంలో టెలికాం సంస్థలన్నీ నష్టాలను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. జూన్తో ముగిసిన త్రైమాసికానికి ఐడియా రూ. 815 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.220 కోట్ల లాభాన్ని ప్రకటించింది. దీంతో పోలిస్తే ఈ సంవత్సరం భారీగా నష్టపోయింది. అంతే కాకుండా ఆదాయం సైతం 14% తగ్గి రూ.8182 కోట్లుగా ఉంది.
విశ్లేషకులు ఐడియాకు త్రైమాసిక నష్టాలు రూ.671 కోట్లు ఉండొచ్చని భావించారు. దేశంలో కుబేరుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత మార్కెట్లోకి జియో నెట్వర్క్తో ప్రవేశించారు. 30 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్రవేశించిన రిలయన్స్ జియో మార్కెట్లో ఇతర పోటీ కంపెనీలకు గట్టి పోటీ నిస్తోంది.
Comments
English summary
మూడో వరుస త్రైమాసికంలోనూ ఐడియాకు నష్టాలే... | Idea Cellular Posts losses in the quarter ended with june
Story first published: Thursday, July 27, 2017, 17:39 [IST]