For Quick Alerts
For Daily Alerts
అల్ఫాబెట్ బోర్డులోకి సుందర్ పిచాయ్
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆ మాతృ కంపెనీ అల్పాబెట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. దీంతో గత రెండేళ్లుగా గూగుల్ సంస్థను విజయవంతంగా నడిపిస్తున భారత సంతతికి చెందిన పిచాయ్ మరో విశిష్టతను పొం
|
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆ మాతృ కంపెనీ అల్పాబెట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. దీంతో గత రెండేళ్లుగా గూగుల్ సంస్థను విజయవంతంగా నడిపిస్తున భారత సంతతికి చెందిన పిచాయ్ మరో విశిష్టతను పొందినట్లయ్యింది.
యూ ట్యూబ్, గూగుల్ యాజమాన్య సంస్థ అయిన ఆల్పాబెట్ బోర్డుకు పిచాయ్ నియమితులయ్యారని అల్పాబెట్ సీఈవో ల్యారీ పేజ్ వెల్లడించారు. గూగుల్ సీఈవోగా సుందర్ మంచి కృషిని కొనసాగిస్తున్నారని, భాగ స్వామ్యాలు, అద్బుతమైన నూతన ఆవిష్కరణలతో చెప్పుకోదగ్గ అభివృద్దిని నమోదు చేస్తున్నారని ప్రశంసించారు. పిచాయ్ తన బాధ్యతలను ఎంతో సమర్థంగా నిర్వర్తిస్తున్నారన్నారు. ఇప్పుడు ఆయన అల్పాబెట్లో బోర్డులో చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 26 బిలియన్ డాలర్ల అమ్మకాలపై 3.5 బిలియన్ డాలర్ల నికర ఆదాయం సాధించినట్టు ఆ కంపెనీ తెలిపింది.
Comments
English summary