జియో దెబ్బతో ఎయిర్టెల్పై తీవ్ర ప్రభావం
టెలికం రంగంలో రిలయన్స్ జియో సృష్టించిన తీవ్ర పోటీతో భారతీ ఎయిర్టెల్ లాభాలకు మరోమారు గండిపడింది. 2017 జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ఎయిర్టెల్ నికర లాభాలు 75 శాతం పతనమై రూ.367 కోట్లకు ప
టెలికం రంగంలో రిలయన్స్ జియో సృష్టించిన తీవ్ర పోటీతో భారతీ ఎయిర్టెల్ లాభాలకు మరోమారు గండిపడింది. 2017 జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ఎయిర్టెల్ నికర లాభాలు 75 శాతం పతనమై రూ.367 కోట్లకు పరిమితమయ్యాయి.
గతేడాది ఇదే క్యూ1లో ఏకంగా రూ.1,462 కోట్ల లాభాలు సాధించింది. క్రితం మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.373 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ 14 శాతం పతనమై రూ.25,546 కోట్ల నుంచి రూ.21,958 కోట్లకు క్షీణించింది. మొబైల్ డేటా రెవెన్యూ 16.8 శాతం పతనమై రూ.3,765 కోట్లుగా నమోదయ్యింది. దేశీయ రెవెన్యూలో 10 శాతం తగ్గి రూ.17,244 కోట్లుగా చోటు చేసుకుంది. కొత్త ఆపరేటర్ వల్ల క్రితం త్రైమాసికంలోనూ మొబైల్ మార్కెట్లో ఒత్తిళ్లు చోటు చేసుకున్నాయని భారతీ ఎయిర్టెల్ ఇండియా సిఇఒ గోపాల్ విట్టల్ పేర్కొన్నారు. మంగళవారం బిఎస్ఇలో భారతీ ఎయిర్టెల్ షేర్ 1.76 శాతం పెరిగి రూ.427.60 వద్ద ముగిసింది.