For Quick Alerts
For Daily Alerts
రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశ ముఖ్యాంశాలు
40 ఏళ్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ టర్నోవర్ 4700 రెట్లు పెరిగి 3.30 ట్రిలియన్లకు పెరిగింది. అదే కాలంలో లాభం 10వేల రెట్లు పెరిగి రూ.30వేల కోట్లయింది. శుక్రవారం రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమా
|
40 ఏళ్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ టర్నోవర్ 4700 రెట్లు పెరిగి 3.30 ట్రిలియన్లకు పెరిగింది. అదే కాలంలో లాభం 10వేల రెట్లు పెరిగి రూ.30వేల కోట్లయింది. శుక్రవారం రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో భాగంగా రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ వివరాలను వెల్లడించారు. రిలయన్స్ జియోకు సంబంధించి కొత్త ప్రకటనలు ఏవైనా ఉంటాయని వాటాదారులంతా వేచిచూస్తున్నారు. వాటాదారులతో పాటు, వినియోగదారులు సైతం రిలయన్స్ ప్రకటించిన 4జీ ఫీచర్ ఫోన్ గురించి మరింత సమచారం ఏదైనా వెలువడుతుందేమోనని ఎదురు చూస్తున్నారు. రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో అంబానీ ప్రసంగిస్తున్నారు. అందులోని కొన్ని ముఖ్య విషయాలు ఇక్కడ చూడొచ్చు. త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టిన రిలయన్స్
రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్ అంబానీ చెప్పిన ముఖ్యాంశాలు
దేశంలో ఉన్న 78 కోట్ల మొబైల్ ఫోన్ల వాడకం దార్లలో, ఇంకా 50 కోట్ల మంది డిజిటల్ విప్లవానికి దూరంగా ఉన్నారు.
మొబైల్ డేటా వాడకంలో భారతదేశం... అమెరికా, చైనాలను మించిపోయింది.
రియలన్స్ జియో వచ్చిన ఆరు నెలల్లోనే డేటా వాడకం ఆరు రెట్లు పెరిగింది.
ఒక నెలలో ఇంతకు ముందు వాడే డేటా 20 కోట్ల జీబీ కాగా ఇప్పుడు వాడే డేటా 120 కోట్ల జీబీకి పెరిగింది.
ప్రస్తుతం రియలన్స్ జియోకు 12.5 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అంటే ప్రతి రోజు ఒక సెకండుకు 7 మంది కస్టమర్లను చేర్చుకున్నట్లు లెక్క.
రిలయన్స్ షేర్లలో 1977లో రూ.1000 పెట్టుబడి పెట్టి ఉంటే దాని విలువ 1600 రెట్లు పెరిగి ఈ రోజుకు రూ.16,54,503గా ఉండేది.
Comments
English summary