కొత్త రూ.20 నోట్లను విడుదల చేయనున్న ఆర్బీఐ
త్వరలో ఆర్బీఐ మహాత్మాగాంధీ సిరీస్-2005లో కొత్త రూ.20 నోట్లను విడుదల చేయనుంది. ఈ కొత్త నోట్లలో ఇన్సెట్ లెటర్ ఎస్ రెండు వైపులా ఉంటుందని ఆర్బీఐ నోటిఫికేషన్ పేర్కొంది.
త్వరలో ఆర్బీఐ మహాత్మాగాంధీ సిరీస్-2005లో కొత్త రూ.20 నోట్లను విడుదల చేయనుంది. ఈ కొత్త నోట్లలో ఇన్సెట్ లెటర్ ఎస్ రెండు వైపులా ఉంటుందని ఆర్బీఐ నోటిఫికేషన్ పేర్కొంది. అంతే కాకుండా కొత్త నోట్లన్నింటిపై ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ ఊర్జిత్ పటేల్ సంతకం ఉంటుంది. ఇదిరకే చలామణీలో ఉన్న పాత రూ.20 నోట్లన్నీ చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ తెలిపింది.
డిజైన్కు సంబంధించి కొత్త నోట్లలో పెద్దగా మార్పులు ఉండబోవని తెలుస్తోంది. సెప్టెంబర్లో జారీ చేసిన రూ.20 నోట్ల ఇన్సెట్ లెటర్ 'R' కాగా,ఇప్పుడు ఇన్సెట్ లెటర్ మారుతోంది. గతంలో ఈ నెలలో రూ.200 నోట్లకు సంబంధించిన వార్తలు వచ్చినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ నుంచి అధికారిక సమచారం వెలువడలేదు. రోజువారీ లావాదేవీలు సులభతరం చేసేందుకు ఆర్బీఐ రూ.200 నోట్లను ప్రింట్ చేస్తోందని, త్వరలో మార్కెట్లోకి వస్తాయని వార్తా కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.