For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త రూ.20 నోట్ల‌ను విడుద‌ల చేయ‌నున్న ఆర్‌బీఐ

త్వ‌ర‌లో ఆర్‌బీఐ మ‌హాత్మాగాంధీ సిరీస్‌-2005లో కొత్త రూ.20 నోట్ల‌ను విడుద‌ల చేయ‌నుంది. ఈ కొత్త నోట్ల‌లో ఇన్‌సెట్ లెట‌ర్ ఎస్ రెండు వైపులా ఉంటుంద‌ని ఆర్బీఐ నోటిఫికేష‌న్ పేర్కొంది.

|

త్వ‌ర‌లో ఆర్‌బీఐ మ‌హాత్మాగాంధీ సిరీస్‌-2005లో కొత్త రూ.20 నోట్ల‌ను విడుద‌ల చేయ‌నుంది. ఈ కొత్త నోట్ల‌లో ఇన్‌సెట్ లెట‌ర్ ఎస్ రెండు వైపులా ఉంటుంద‌ని ఆర్బీఐ నోటిఫికేష‌న్ పేర్కొంది. అంతే కాకుండా కొత్త నోట్ల‌న్నింటిపై ఆర్‌బీఐ ప్ర‌స్తుత‌ గ‌వ‌ర్న‌ర్ ఊర్జిత్ ప‌టేల్ సంత‌కం ఉంటుంది. ఇదిర‌కే చ‌లామ‌ణీలో ఉన్న పాత రూ.20 నోట్ల‌న్నీ చెల్లుబాటు అవుతాయ‌ని ఆర్‌బీఐ తెలిపింది.

 ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ ఊర్జిత్ ప‌టేల్ సంత‌కంతో కొత్త రూ.20 నోటు

డిజైన్‌కు సంబంధించి కొత్త నోట్ల‌లో పెద్ద‌గా మార్పులు ఉండ‌బోవ‌ని తెలుస్తోంది. సెప్టెంబ‌ర్లో జారీ చేసిన రూ.20 నోట్ల ఇన్‌సెట్ లెట‌ర్ 'R' కాగా,ఇప్పుడు ఇన్‌సెట్ లెట‌ర్ మారుతోంది. గ‌తంలో ఈ నెల‌లో రూ.200 నోట్ల‌కు సంబంధించిన వార్త‌లు వచ్చిన‌ప్ప‌టికీ రిజ‌ర్వ్ బ్యాంక్ నుంచి అధికారిక స‌మ‌చారం వెలువ‌డ‌లేదు. రోజువారీ లావాదేవీలు సుల‌భ‌త‌రం చేసేందుకు ఆర్‌బీఐ రూ.200 నోట్ల‌ను ప్రింట్ చేస్తోంద‌ని, త్వ‌ర‌లో మార్కెట్లోకి వ‌స్తాయ‌ని వార్తా క‌థ‌నాలు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే.

Read more about: rbi banking
English summary

కొత్త రూ.20 నోట్ల‌ను విడుద‌ల చేయ‌నున్న ఆర్‌బీఐ | New 20 rupees note with urjit patel signature

The Reserve Bank will shortly issue bank notes of denomination Rs. 20 in Mahatma Gandhi series 2005 that will be similar in design to those currently in circulation.
Story first published: Thursday, July 20, 2017, 10:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X