For Quick Alerts
For Daily Alerts
దేశీయ సూచీలు రికార్డు ముగింపుల దిశగా
మార్కెట్లు మళ్లీ లాభాల సునామీని చూశాయి. సెన్సెక్స్ కొత్త గరిష్టాల వద్ద ముగిసింది. సూచీలు రెండు జీవన కాల గరిష్టాలను తాకాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 54 పాయింట్లు లాభపడి 32,075 వద్ద ముగియగా; మరో సూచ
|
మార్కెట్లు మళ్లీ లాభాల సునామీని చూశాయి. సెన్సెక్స్ కొత్త గరిష్టాల వద్ద ముగిసింది. సూచీలు రెండు జీవన కాల గరిష్టాలను తాకాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 54 పాయింట్లు లాభపడి 32,075 వద్ద ముగియగా; మరో సూచీ నిఫ్టీ 30 పాయింట్లు పుంజుకొని 9915.95 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి(1.28%), లోహ రంగం(0.97%), ఐటీ(0.95%), టెక్నాలజీ(0.89%) లాభపడగా, మరో వైపు ఎఫ్ఎంసీజీ(1.54%), క్యాపిటల్ గూడ్స్(0.07%) నష్టపోయాయి.
సెన్సెక్స్లో లాభపడిన వాటిలో విప్రో(3.12%), అదానీ పోర్ట్స్(1.81%), ఐసీఐసీఐ బ్యాంకు(1.69%), సిప్లా(1.56%), ఇన్ఫోసిస్(1.37%) ముందుండగా, నష్టపోయిన వాటిలో ఐటీసీ(3.4%), కోల్ ఇండియా(1.34%), డాక్టర్ రెడ్డీస్(0.72%), యాక్సిస్ బ్యాంకు(0.42%), మారుతి(0.41%) ఉన్నాయి.
Comments
English summary
దేశీయ సూచీలు రికార్డు ముగింపుల దిశగా | sensex closed at new peak 32075
Story first published: Monday, July 17, 2017, 16:56 [IST]