For Quick Alerts
For Daily Alerts
రూ.1000 వరకూ ఐంఎమ్పీఎస్ బదిలీలకు చార్జీల్లేవు
ఐఎంపీఎస్ ఛార్జీలను దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ మార్చింది. ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్(ఐఎంపీఎస్) ఛార్జీలను సవరిస్తూ కొత్త రేట్లను ట్విటర్లో ప్రకటించింది. ఐఎంపీఎస్ కింద రూ.1000 వరకు ఇతర ఖాతాలక
|
ఐఎంపీఎస్ ఛార్జీలను దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ మార్చింది. ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్(ఐఎంపీఎస్) ఛార్జీలను సవరిస్తూ కొత్త రేట్లను ట్విటర్లో ప్రకటించింది. ఐఎంపీఎస్ కింద రూ.1000 వరకు ఇతర ఖాతాలకు పంపిస్తే ఎలాంటి రుసుములు ఉండవు.
సాధారణంగా రూ.1000 నుంచి రూ.లక్ష వరకు పంపిస్తే రూ.5ను రుసుముగా వసూలు చేస్తారు. అలాగే రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు మనీ ట్రాన్స్ఫర్పై రూ.15ను ఛార్జీగా వసూలు చేస్తారు. ఈ రుసుములకు జీఎస్టీ అదనమని బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. జులై 1 నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ రుసుములను సవరించినట్లు బ్యాంక్ పేర్కొంది. జీఎస్టీ కింద బ్యాంకింగ్, ఆర్థిక సేవలపై 18 శాతం పన్ను పడనున్న విషయం తెలిసిందే.
Comments
English summary
రూ.1000 వరకూ ఐంఎమ్పీఎస్ బదిలీలకు చార్జీల్లేవు | SBI waives charge on IMPS transfers upto 1000 rupees
Story first published: Wednesday, July 12, 2017, 16:52 [IST]