For Quick Alerts
For Daily Alerts
చైనాను మించి భారత్ వృద్ది : హర్వర్డ్
వచ్చే దశాబ్ద కాలంలో చైనాను దాటేసి భారతదేశం అభివృద్దిని సాధిస్తుందని హర్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం వెల్లడించింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అంతర్జాతీయ అభివృద్ది కేంద్రం ఈ విధ
|
వచ్చే దశాబ్ద కాలంలో చైనాను దాటేసి భారతదేశం అభివృద్దిని సాధిస్తుందని హర్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం వెల్లడించింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అంతర్జాతీయ అభివృద్ది కేంద్రం ఈ విధమైన అంచనాలను వెలువరించింది. దీని ప్రకారం 2025 వరకూ భారత్ అభివృద్ది చెందుతున్న దేశాల్లో ప్రథమ శ్రేణిలో ఉండటంతో పాటు, కొన్ని కారణాల వల్ల వృద్ది రేటు 7.7%గా ఉండగలదు.
ప్రపంచ వృద్దికి సంబంధించి ఆర్థిక వృద్ది చక్రం చైనా నుంచి భారత్కు కదులుతున్నట్లు అధ్యయనం చెప్పింది. "ఒపెక్ దేశాలు కేవలం ఒకే వనరుపై ఆధారపడ్డ మూలంగా వృద్దిలో ఆటంకాలు ఎదుర్కొంటున్నాయి. భారత్, ఇండోనేషియా, వియత్నాం కొత్త మార్గాలను అన్వేషించిన కారణంగా కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. వచ్చే కొన్నేళ్లలో వేగవంతమైన వృద్ది సాధ్యమవుతుంది." అని నివేదిక అభిప్రాయపడింది.
Comments
English summary
చైనాను మించి భారత్ వృద్ది : హర్వర్డ్ | Harvard varsity said India as new growth destination of the world
Story first published: Monday, July 10, 2017, 12:54 [IST]