For Quick Alerts
For Daily Alerts
ఎన్ఎస్ఈ సాంకేతిక లోపంపై నివేదిక కోరిన ఆర్థిక శాఖ
ఎన్ఎస్ఈలో సాంకేతిక లోపం కారణంగా ట్రేడింగ్ అంతరాయానికి సంబంధించి నివేదిక పంపాల్సిందిగా సెబీని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కోరింది. సాంకేతిక లోపం తలెత్తడంతో కొద్దిసేపు ఎన్ఎస్ఈ ట్రేడింగ్ను నిలిపివేశార
|
ఎన్ఎస్ఈలో సాంకేతిక లోపం కారణంగా ట్రేడింగ్ అంతరాయానికి సంబంధించి నివేదిక పంపాల్సిందిగా సెబీని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కోరింది. సాంకేతిక లోపం తలెత్తడంతో కొద్దిసేపు ఎన్ఎస్ఈ ట్రేడింగ్ను నిలిపివేశారు. అనంతరం సమస్యను పరిష్కరించడంతో ట్రేడింగ్ను పునరుద్ధరించారు. కేవలం సాంకేతికలోపం వల్లే ఇలా జరిగిందని, హ్యాకింగ్ గురించి ఎలాంటి సమాచారం లేదని ఆర్థికమంత్రిత్వశాఖకు అధికార వర్గాలు వివరణ ఇచ్చాయి.
సెబీ నిరంతరాయంగా దీన్ని పర్యవేక్షిస్తోందని, ఆర్థిక శాఖకు సంబంధించి ఇది పెద్ద సమస్య అని, ఇలాంటివి మళ్లీ జరగవని ఆశిస్తున్నట్లు కొన్ని అధికార వర్గాల సమాచారం. సెబీ ఇచ్చే నివేదిక కోసం వేచి చూస్తామని దీని వ్యవహారాలను పర్యవేక్షించే ఒక అధికారి చెప్పారు. తాము ఎన్ఎస్ఈతో సంప్రదిస్తూనే ఉన్నామని, పరిస్థితులను సమీక్షిస్తున్నామని సెబీ ఒక ప్రకటలో తెలిపింది.
Comments
English summary
ఎన్ఎస్ఈ సాంకేతిక లోపంపై నివేదిక కోరిన ఆర్థిక శాఖ | fin min seeks a report on technical glitch in national stock exchange
Story first published: Monday, July 10, 2017, 15:41 [IST]