For Quick Alerts
For Daily Alerts
ఎన్సీడీల ద్వారా రూ.25 వేల కోట్లు
ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారీ నిధుల సేకరణకు రిలయన్స్ సిద్దమవుతోంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్ దాదాపు రూ.25 వేల కోట్ల సేకరణ కోసం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్(ఎన్సీడీల) మార్గాన
|
వివిధ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారీ నిధుల సేకరణకు రిలయన్స్ సిద్దమవుతోంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్ దాదాపు రూ.25 వేల కోట్ల సేకరణ కోసం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్(ఎన్సీడీల) మార్గాన్ని ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఆ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీ వద్ద సమర్పించిన సమాచారం ఆధారంగా ఇది బయటపడింది.
జులై 21న జరగనున్న కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ తీర్మానం వాటాదారుల ముందకు ఓటింగ్కు వస్తుంది. ఈ ఏడాదిలో ఒక కంపెనీ ఇంత పెద్ద ఎత్తున బాండ్ల జారీ ద్వారా డబ్బు సేకరించడం ఇదే ప్రథమం. ఏప్రిల్, మే నెలల్లో 602 ఇష్యూల ద్వారా రూ.97,207 కోట్ల నిధుల సేకరణ జరిగిందని సెబీ వద్ద ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
Comments
English summary
ఎన్సీడీల ద్వారా రూ.25 వేల కోట్లు | RIL looking to rise 25000 crores through NCDs
Story first published: Tuesday, June 27, 2017, 10:05 [IST]