ఎస్సార్ ఆయిల్-రాస్నెఫ్ట్ డీల్కు బ్యాంకుల కన్సార్టియం ఓకే
A day after sending the Essar Group’s steel company to the National Company Law Tribunal (NCLT) for action under the insolvency code, the Joint Lenders Forum (JLF), led by State Bank of India and ICI
ఒక పక్క విపరీతమైన అప్పులతో ఎస్సార్ ఆయిల్ సతమతమవుతోంది. మరో వైపు రాస్నెఫ్ట్ సంస్థతో విలీనం దిశగా చర్చలు జరుపుతోంది. అయితే బ్యాంకులకు విపరీతమైన అప్పులు ఉన్న కారణంగా మొదట బ్యాంకింగ్ కన్సార్టియం ఈ ఒప్పందానికి అనుమతించకపోగా ఈ విషయాన్ని నేషనల్ కంపెనీ ఆప్ లా ట్రిబ్యునల్కు తీసుకెళ్లారు. చివరకు సమిష్టి నిర్ణయం మేరకు ఎస్బీఐ, ఐసీఐసీఐ నేతృత్వంలోని ఉమ్మడి రుణదాతల ఫోరం(జాయింట్ లెండర్స్ ఫోరం) ఎస్సార్ ఆయిల్లో 86 వేల కోట్ల వాటాను రాస్నెఫ్ట్కు అమ్మేందుకు అనుమతించింది.
23 బ్యాంకుల కన్సార్టియం రుణం కోసం ఎస్సార్ హామీగా ఉంచిన ఎస్సార్ ఆయిల్ షేర్లను ఇచ్చేందుకు అనుమతించినట్లు తెలుస్తోంది. తద్వారా విక్రయ లావాదేవీ పూర్తవుతుంది. ఎస్సార్ వాటాను రాస్నెఫ్ట్కు విక్రయించగా వచ్చిన డబ్బును దేశ, విదేశీ బ్యాంకులకు చెల్లించి కంపెనీ నుంచి రుయాలు తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకసారి రాస్నెఫ్ట్ చేతిలోకి కంపెనీ వెళ్లిన తర్వాత, రుయాలు ఎస్సార్ గ్రూప్కు ఉన్న రూ.27 వేల కోట్ల అప్పులను తీర్చనుండగా, కొత్త యాజమాన్యం తమ నూతన బ్రాండ్ పేరిట ఎస్సార్ ఆయిల్ను నిర్వహించే అవకాశం ఉంది.