For Quick Alerts
For Daily Alerts
రైతు రుణ మాఫీల భారం రూ. 1.5-2.3 ట్రిలియన్
5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత యూపీలో గెలిచిన భాజపా ప్రభుత్వం దేశంలోని అతిపెద్ద రాష్ట్రంలో రైతు రుణ మాఫీని ప్రకటించడంతో దేశవ్యాప్త చర్చ మొదలైంది. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు రుణ మాఫీ దిశగా
|
5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత యూపీలో గెలిచిన భాజపా ప్రభుత్వం దేశంలోని అతిపెద్ద రాష్ట్రంలో రైతు రుణ మాఫీని ప్రకటించడంతో దేశవ్యాప్త చర్చ మొదలైంది. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు రుణ మాఫీ దిశగా యోచిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ ప్రకటన చేసేసింది. ఈ వారంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సైతం దాదాపు రూ.8 వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది.
ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇకపై మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, హర్యానా సైతం ఇదే బాటలో నడుస్తాయని అంచనా ఉంది. దీనికి సంబంధించి ఈడెల్వెయిస్(Edelweiss) ఒక పరిశోధన చేసింది. ప్రస్తుతం రైతులకు ఉన్న బ్యాంకు రుణాల్లో 20 నుంచి 30 శాతం వాటిని మాఫీ చేసేందుకు ప్రయత్నిస్తే 2017-18 జీడీపీలో 1.0-1.5% వరకూ అంటే రూ.1.5 నుంచి 2.3 ట్రిలియన్ వరకూ ఈ భారం పెరుగుతుందని తెలిపింది. భవిష్యత్తులో సమయానికి రైతులు రుణాలు చెల్లించే సంస్కృతి మారిపోయి, తద్వారా ఇది బ్యాంకులపై భారం కాగలదని పలువురు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Comments
English summary
రైతు రుణ మాఫీల భారం రూ. 1.5-2.3 ట్రిలియన్ | deterioration in credit culture is will add potential risk for banks
Story first published: Friday, June 23, 2017, 11:21 [IST]