సీడీఎస్ఎల్ ఐపీవో సోమవారం ప్రారంభం
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) ప్రమోట్ చేసిన సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్(సీడీఎస్ఎల్) పబ్లిక్ ఇష్యూ సోమవారం(19న) మొదలుకానుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 145-149కాగా.. ఇష్యూ ఈ నెల 21న(బుధవారం
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) ప్రమోట్ చేసిన సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్(సీడీఎస్ఎల్) పబ్లిక్ ఇష్యూ సోమవారం(19న) మొదలుకానుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 145-149కాగా.. ఇష్యూ ఈ నెల 21న(బుధవారం) ముగియనుంది. డిపాజిటరీ సేవలందించే సీడీఎస్ఎల్ ఐపీవో ద్వారా రూ. 1500 కోట్ల విలువను సమీకరించాలని ప్రణాళిక రచించింది.
ఐపీవో తరువాత కంపెనీలో బీఎస్ఈ వాటా 24 శాతానికి పరిమితంకానుంది. ప్రస్తుతం బీఎస్ఈకి 50 శాతానికిపైగా వాటా ఉంది. కాగా.. ఈ ఇష్యూ ద్వారా సీడీఎస్ఎల్ దేశంలోనే తొలి లిస్టెడ్ డిపాజిటరీ సర్వీసెస్ కంపెనీగా నిలవనుంది. ఇప్పటికే మాతృ సంస్థ బీఎస్ఈ జనవరిలో పబ్లిక్ ఇష్యూ చేపట్టడం ద్వారా దేశంలో లిస్టింగ్ పొందిన తొలి ఎక్స్ఛేంజీగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఐపీవో ద్వారా బీఎస్ఈ రూ. 1243 కోట్లను సమీకరించింది. త్వరలోనే బీఎస్ఈకి ప్రధాన ప్రత్యర్థి అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) సైతం లిస్ట్కానుంది.