జీఎస్టీలో పన్ను లేని వస్తువులు ఏవి?
జీఎస్టీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొన్ని ఉత్పత్తులపైన అసలే పన్ను లేకుండా కేంద్రం జాగ్రత్త పడింది. వివిధ వర్గాల నుంచి జీఎస్టీ పన్ను రేట్లు మార్చాల్సిందిగా వినతులు వస్తున్నాయి. ఈ నేప
జీఎస్టీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొన్ని ఉత్పత్తులపైన అసలే పన్ను లేకుండా కేంద్రం జాగ్రత్త పడింది. వివిధ వర్గాల నుంచి జీఎస్టీ పన్ను రేట్లు మార్చాల్సిందిగా వినతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ లేని వస్తువుల జాబితాను కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
ఆహార పదార్థాలు, పిండి, పప్పు దినుసులు, తృణధాన్యాలు, గోధుమలు, మైదా, శెనగపిండి, పాలు, కూరగాయలు, తాజా పండ్లు, ఉడికించిన బియ్యం, సాధారణ ఉప్పు, పశువుల దాణా, సేంద్రీయ ఆహార పదార్థాలు, ముడి సిల్కు, ముడి ఉన్ని, జనపనార వస్తువులు, చేతివృత్తుల ద్వారా తయారవుతున్న వ్యవసాయ సామగ్రికి పన్ను మినహాయింపు ఉన్నట్లు నోటిఫికేషన్లో వివరించారు.. బ్రాండెడ్ ఆహార పదార్థాల విషయంలో మాత్రం 5 శాతం విధిస్తున్నట్టు పేర్కొంది. జీఎస్టీలో మొత్తం మీద నాలుగు రకాల పన్ను రేట్లు ఉన్నాయి. ఆ పన్ను శాతాలు 5,12,18,28 గా ఉన్నాయి. విలువైన లోహాలు (బంగారం,వెండి), ఆభరణాలు 3 శాతం పన్ను పరిధిలోకి వస్తాయి. కఠిన తరహా వజ్రాలపై 0.25% జీఎస్టీ అమలవుతుంది. జీఎస్టీ అమలు ద్వారా ఇప్పటి వరకూ దేశంలో ఉన్న పరోక్ష పన్నులన్నీ తొలగిపోతాయి.