తేజాస్ నెట్వర్క్ ఐపీవో ద్వారా 776 కోట్లా!
తేజాస్ నెట్వర్క్స్ ఐపీవో ద్వారా సంస్థ రూ.776 కోట్లు సమీకరించనుంది. టెలికం సంస్థలకు ఉత్పత్తులు, డిజైన్ సేవలు అందించే ఈ సంస్థ ఐపీవో ఈ నెల 14న ప్రారంభం కానుంది. జూన్ 16న ముగుస్తుంది. షేరు ముఖ విలువ
తేజాస్ నెట్వర్క్స్ ఐపీవో ద్వారా సంస్థ రూ.776 కోట్లు సమీకరించనుంది. టెలికం సంస్థలకు ఉత్పత్తులు, డిజైన్ సేవలు అందించే ఈ సంస్థ ఐపీవో ఈ నెల 14న ప్రారంభం కానుంది. జూన్ 16న ముగుస్తుంది. షేరు ముఖ విలువ రూ. 10 ఉండగా; ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.250-257 మధ్య ఖరారు చేశారు. ఇందులో రూ.450 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. దీనికి అదనంగా 1,27,11,605 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. కనీసం 55 షేర్లకు (ఒక లాట్) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, నోమురా ఫైనాన్షియల్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో షేర్లు లిస్ట్ అవుతాయి. 60 దేశాల్లోని టెలికం, ఇంటర్నెట్ సేవలు, యుటిలిటీలు, రక్షణ రంగంలోని కంపెనీలకు ఈ సంస్థ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. ఈ కంపెనీ మార్చి 2017తో ముగిసిన త్రైమాసికానికి రూ.53.2 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే సమయంలో ఈ లాభం రూ. 27.4 కోట్లుగా ఉంది.