ఆవాస్ యోజన కింద 2017-18లో 12 లక్షల ఇళ్లు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా 2017-18లో దేశవ్యాప్తంగా 12 లక్షల ఇళ్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ పథకంలో భాగంగా 2016-17లో నిర్మించిన ఇళ్ల సంఖ్య 1.49
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా 2017-18లో దేశవ్యాప్తంగా 12 లక్షల ఇళ్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ పథకంలో భాగంగా 2016-17లో నిర్మించిన ఇళ్ల సంఖ్య 1.49లక్షలు కావడం గమనార్హం. ఒక సీనియర్ ప్రభుత్వాధికారి ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడించారు.
2018-19లో 26 లక్షలు, 2019-20లో 26 లక్షలు, 2020-21లో 30 లక్షలు, 2021-22లో 29.80 లక్షల ఇళ్లను నిర్మించాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా ఉందన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం చాలా నిదానంగా సాగేందుకు భూసేకరణ ఆలస్యంగా జరగడమే కారణమని చెప్పారు. ఇప్పటివరకూ 18.76 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు రాగా, 13.06 లక్షల ఇళ్లకు నిధులు విడుదలయ్యాయి. అయితే భూసేకరణలో ఆలస్యం కారణంగా కేవలం 1.49 లక్షల ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. ఇది 2016-17 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పురోగతి అని ఆయన చెప్పారు. 2015 జూన్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ప్రారంభించారు. 2022 కల్లా అందరికీ ఇళ్లు ఉండాలనేది ఈ పథకం లక్ష్యం.