106 పాయింట్ల లాభంలో సెన్సెక్స్
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 106 పాయింట్లు పెరిగి 30,571 వద్ద ముగియగా, నిఫ్టీ సైతం 10 పాయింట్లు బలపడి 9,438 వద్ద స్థిర
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 106 పాయింట్లు పెరిగి 30,571 వద్ద ముగియగా, నిఫ్టీ సైతం 10 పాయింట్లు బలపడి 9,438 వద్ద స్థిరపడింది. అయితే శుక్రవారం యూరప్, అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియగా.. నేటి ట్రేడింగ్లో ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలడంతో మన మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్ను లాభాలతో మొదలుపెట్టాయి. సెన్సెక్స్ తొలుత 200 పాయింట్లకుపైగా దూసుకెళ్లగా.. నిఫ్టీ దాదాపు 9,500కు చేరింది. జీఎస్టీ కౌన్సిల్ సబ్బులు, వంటనూనెలు వంటి నిత్యావసర వస్తువులపై తక్కువ పన్ను రేట్లను నిర్ణయించడంతో వరుసగా రెండో రోజు ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు రాణించాయి. అయితే మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకు కౌంటర్లలో భారీ అమ్మకాలు నమోదుకావడంతో మార్కెట్లు మిడ్సెషన్ నుంచీ కొంతమేర వెనకడుగు వేశాయి. చివరికి ఓ మాదిరి లాభాలతో ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్లో లాభపడిన వాటిలో యునైటెడ్ స్పిరిట్స్(6.72%), ఐటీసీ(6.21%), వాబాగ్(2.47%), అదానీట్రాన్స్(2.47%), మదర్సుమి(2.40%) ఉండగా; నష్టపోయిన వాటిలో వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(19.36%), బ్యాంక్ఆఫ్ఇండియా(11.23%), వీఆర్ఎల్ లాజిస్టిక్స్(8.48%), జేపీ అసోసియేట్స్(8.26%), జెట్ ఎయిర్వేస్(8.14%) ఉన్నాయి.