For Quick Alerts
For Daily Alerts
వ్యవసాయంలో అధిక ఆదాయం ఉన్నవారికి పన్ను విధించాల్సిందే
వ్యవసాయంలో ఒక పరిమితికి మించి ఆదాయం ఉన్నవారికి పన్ను విధించడాన్ని తాను సమర్థిస్తున్నానని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ బీమల్ జలాన్ అభిప్రాయపడ్డారు. అయితే అదే సమయంలో చిన్న రైతుల ఆదాయాల
|
వ్యవసాయంలో ఒక పరిమితికి మించి ఆదాయం ఉన్నవారికి పన్ను విధించడాన్ని తాను సమర్థిస్తున్నానని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ బీమల్ జలాన్ అభిప్రాయపడ్డారు. అయితే అదే సమయంలో చిన్న రైతుల ఆదాయాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదన్నారు. "మీకు పెద్ద ఎత్తున భూములున్నాయి అనుకుందాం, అందులో నుంచి మీకు చాలా ఎక్కువ ఆదాయం వస్తుంటే, అప్పుడు ఒక పరిమితికి మించి వచ్చే ఆదాయంపై పన్ను వేయడం గురించి ఆలోచించాలి" అని పీటీఐ ఇంటర్వ్యూలో ఆర్బీఐ మాజీ గవర్నర్ చెప్పారు.
దేశంలో ఎక్కువ మంది రైతులకు చిన్న కమతాలు ఉన్నాయి. ఏదైనా చర్య తీసుకునేటప్పుడు వారిపై ఎటుంటి ప్రతికూల ప్రభావం ఉండకూడదన్నారు. తక్కువ ద్రవ్యోల్బణం, అధిక వృద్ది ఎన్డీఏ ప్రభుత్వ ఘనతలుగా చెప్పుకొచ్చారు. అయితే అవినీతిని తగ్గించేందుకు, పరిపాలన సంస్కరణల విషయంలో ఈ ప్రభుత్వం చాలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. తన దృష్టిలో దేశ బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉందని భరోసా వ్యక్తం చేశారు.
Comments
English summary
వ్యవసాయంలో అధిక ఆదాయం ఉన్నవారికి పన్ను విధించాల్సిందే | Former RBI Chief Says Government Should Think About Taxing Rich Farmers
Story first published: Monday, May 22, 2017, 11:38 [IST]