For Quick Alerts
For Daily Alerts
జీఎస్టీ తర్వాత బ్యాంకు రుసుములు పెరుగుతాయా?
జీఎస్టీ అమలు తర్వాత ఆర్థిక సేవలు సైతం కాస్త ప్రియం కానున్నాయి. ప్రభుత్వం జీఎస్టీలో ఆర్థిక సేవలపై 18% పన్ను నిర్ణయించడంతో ట్రాన్సాక్షన్ రుసుములను సైతం మరింత ఎక్కువగా చెల్లించాల్సి రావచ్చు
|
జీఎస్టీ అమలు తర్వాత ఆర్థిక సేవలు సైతం కాస్త ప్రియం కానున్నాయి. ప్రభుత్వం జీఎస్టీలో ఆర్థిక సేవలపై 18% పన్ను నిర్ణయించడంతో ట్రాన్సాక్షన్ రుసుములను సైతం మరింత ఎక్కువగా చెల్లించాల్సి రావచ్చు. ఇదివరకూ ఇవన్నీ 15% పన్ను పరిధిలో ఉండేవి. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం మేరకు బ్యాంకింగ్ వంటి ఆర్థిక సేవలన్నీ 18 శాతం పన్ను పరిధిలోకి వస్తాయి. దీంతో ఇప్పుడు చెల్లించే ప్రతి రూ. 100కు అదనంగా రూ.3 మనం ఎక్కువగా భరించాల్సిందేనని పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కంపెనీల తరపున ఆర్థిక సంస్థలు ఈ అదనపు భారాన్ని తమ ఖర్చులోనే భాగం చేసుకునే అవకాశం ఉంది. అయితే వినియోగదారుల విషయంలో మాత్రం కచ్చితంగా ఆ భారం వారే మోయాల్సి వస్తుంది. ప్రభుత్వం 1211 వస్తు,సేవల రేట్లను జీఎస్టీ చట్టంలో భాగంగా ఖరారు చేసేసింది. ఎక్కువ శాతం వస్తు, సేవలు 18 శాతం జీఎస్టీ పరిధిలో ఉన్నాయి. ఆర్థిక సేవలతో పాటు ఏసీ హోటళ్లు, లిక్కర్, టెలికాం, ఐటీ సేవలు, బ్రాండెడ్ దుస్తులు, రిఫైన్డ్ పంచదార, పాస్తా, కార్న్ ఫ్లేక్స్, పేస్త్రీలు, కేకులు, నిల్వ ఉంచే కూరగాయలు, జామ్లు, సాస్లు, ఐస్ క్రీమ్లు, ఇన్స్టంట్ ఫుడ్ మిక్స్లు, మినరల్ వాటర్, టిస్యూలు, ఎన్వలప్లు, నోటు పుస్తకాలు వంటివి 18% పరిధిలోకి వచ్చిన వాటిలో ఉన్నాయని తెలుస్తోంది.
Comments
English summary
జీఎస్టీ తర్వాత బ్యాంకు రుసుములు పెరుగుతాయా? | You will have to shell out more for banking transactions from July
Story first published: Saturday, May 20, 2017, 15:06 [IST]