పేటీఎమ్ మార్కెట్ విలువ రూ. 45346 కోట్లకు
పేటీఎమ్ జపాన్కు చెందిన సాఫ్ట్బ్యాంక్ సుమారు రూ.9,000 కోట్ల (1.40 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను రాబట్టింది. పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాల విస్తరణకు, వినియోగదారులను పెంచుకునేందుకు ఈ నిధులను పేటీఎం
పేటీఎమ్ జపాన్కు చెందిన సాఫ్ట్బ్యాంక్ సుమారు రూ.9,000 కోట్ల (1.40 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను రాబట్టింది. పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాల విస్తరణకు, వినియోగదారులను పెంచుకునేందుకు ఈ నిధులను పేటీఎం మాతృసంస్థ ఒన్97 కమ్యూనికేషన్స్ ఉపయోగించనుంది. ఈ పెట్టుబడుల వల్ల పేటీఎం మార్కెట్ విలువ 7 బి.డాలర్ల (సుమారు రూ.45346 కోట్ల)కు పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారతదేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి మద్దతుగా తాము ఈ పెట్టుబడులు పెట్టినట్లు సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ ఛైర్మన్, ముఖ్యకార్య నిర్వహణాధికారి (సీఈఓ) మసయోషీ సన్ వెల్లడించారు. సాఫ్ట్బ్యాంక్ పెట్టుబడులు తమ సంస్థకు ఎంతో గుర్తింపును తీసుకొస్తాయని పేటీఎమ్ వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ అన్నారు. రానున్న 3-5 ఏళ్లలో రూ.10,000 కోట్లు పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు వాలెట్ సంస్థ పేర్కొంది. పేటీఎమ్ ఇప్పటికే వెల్త్ మేనేజ్మెంట్; ఇన్సూరెన్స్, డిపాజిట్, రుణ సేవలను అందించేందుకు ప్రణాళికలను సిద్దం చేసింది. సేవలనందించేందుకు గాను పేటీఎమ్ ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టార్టప్ సంస్థలు క్యాపిటల్ ఫస్ట్, క్యాపిటల్ ఫ్లోట్ వంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది.