For Quick Alerts
For Daily Alerts
మే 23 నుంచి పేటీఎమ్ బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభం
ఎన్నో నెలల పాటు ఆలస్యంగా పేటీఎమ్ ఒక మంచి వార్త చెప్పింది. మే 23 నుంచి పేటీఎమ్ బ్యాంకింగ్ కార్యకలాపాలు మొదలవబోతున్నట్లు ప్రకటించింది. "ఆర్బీఐ నుంచి పేటీఎమ్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ తుది లైసై
|
ఎన్నో నెలల పాటు ఆలస్యంగానైనా పేటీఎమ్ ఒక మంచి వార్త చెప్పింది. మే 23 నుంచి పేటీఎమ్ బ్యాంకింగ్ కార్యకలాపాలు మొదలవబోతున్నట్లు ప్రకటించింది. "ఆర్బీఐ నుంచి పేటీఎమ్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ తుది లైసైన్సు అందుకుంది. మా బ్యాంకు మే 23 నుంచి తన పని మొదలుపెడుతుంద"ని పబ్లిక్ నోటీసులో వాలెట్ సంస్థ పేర్కొంది.
దీంతో ఈ నెల 23 తర్వాత పేటీఎమ్ వాలెట్ పేటీఎమ్ పేమెంట్ బ్యాంకుగా మారబోతోంది. దాదాపు 21.8 కోట్ల మంది పేటీఎమ్ యూజర్ల ఖాతాల్లోని సొమ్ము పేమెంట్ బ్యాంకుకు అప్పజెబుతారు. ఆరు నెలల పాటు వాలెట్ను వాడని యూజర్ల విషయంలో ఈ బదిలీ ఖాతాదారు అనమతితోనే జరుగుతుంది.
పేమెంట్ బ్యాంకులు రూ.1 లక్ష వరకూ వ్యక్తులు, చిన్న వ్యాపారుల నుంచి డిపాజిట్లుగా సేకరించవచ్చు. దేశంలో బ్యాంకింగ్ కార్యకలాపాలను విస్తరించేందుకు రిజర్వ్ బ్యాంకు పేమెంట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు అనుమతిచ్చింది.
Comments
English summary