For Quick Alerts
For Daily Alerts
9500 మార్కును దాటిన నిఫ్టీ
ఈ రోజు మార్కెట్లు లాభాల పరుగులు తీశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 260.48 పాయింట్లు లాభపడి 30,582.60 స్థాయికి చేరగా; నిఫ్టీ 66.85 పాయింట్లు ఎగసి 9512 వద్ద ముగిసింది. నిఫ్టీ స్టాక్ మార్కెట్ చరిత్రలో
|
ఈ రోజు మార్కెట్లు లాభాల పరుగులు తీశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 260.48 పాయింట్లు లాభపడి 30,582.60 స్థాయికి చేరగా; నిఫ్టీ 66.85 పాయింట్లు ఎగసి 9512 వద్ద ముగిసింది. నిఫ్టీ స్టాక్ మార్కెట్ చరిత్రలో మొదటిసారి 9500 మార్కును దాటింది. బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే టెక్నాలజీ(1.13%), ఐటీ(1.07%), వాహన రంగం(1.07%), స్థిరాస్తి(1%) లాభపడగా; లోహ రంగం(0.57%) నష్టపోయింది.
సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో హీరో మోటోకార్ప్(3.09%), భారతీ ఎయిర్టెల్(2.98%), టీసీఎస్(2.66%), ఐటీసీ(2.2%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(2.18%) ఉండగా; నష్టపోయిన వాటిలో ఎమ్ అండ్ ఎం(1.02%), ఓఎన్జీసీ(0.96%), కోల్ ఇండియా(0.88%), సిప్లా(0.33%), అదానీ పోర్ట్స్(0.3%) ముందున్నాయి.
Comments
English summary
9500 మార్కును దాటిన నిఫ్టీ | Sensex closes at new peak of 30,583
Story first published: Tuesday, May 16, 2017, 16:58 [IST]