For Quick Alerts
For Daily Alerts
మళ్లీ కొత్త రికార్డులను నమోదు చేసిన సూచీలు
ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. రోజు మొత్తం పటిష్టంగా కదిలాయి. చివరికి దేశ మార్కెట్ చరిత్రలోనే గరిష్టాలవద్ద ముగిశాయి.
|
ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. రోజు మొత్తం పటిష్టంగా కదిలాయి. చివరికి దేశ మార్కెట్ చరిత్రలోనే గరిష్టాలవద్ద ముగిశాయి. సెన్సెక్స్ 134 పాయింట్లు పెరిగి 30,322 వద్ద నిలవగా.. నిఫ్టీ 44.50(0.47%) పాయింట్లకు పైగా లాభపడి 9,445.40 వద్ద స్థిరపడింది. ముగింపులో ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ సైతం 18,406 వద్ద నిలవడం ద్వారా కొత్త రికార్డు సాధించింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే లోహ(2.4%), హెల్త్ కేర్(1.06%), స్థిరాస్తి(0.94%), బ్యాంకింగ్(0.82%) రంగాలు బాగా లాభపడ్డాయి. మరో వైపు రూపాయి బలపడ్డ నేపథ్యంలో ఐటీ, టెక్నాలజీ కంపెనీలకు ఆ సెగ తగిలింది. దీంతో టెక్నాలజీ(0.46%), ఐటీ(0.41%), కన్సూమర్ డ్యూరబుల్స్(0.08%) నష్టాలకు గురయ్యాయి.
సెన్సెక్స్లో లాభ,నష్టాలకు గురైన కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి. టాటా స్టీల్ (+4.35), డాక్టర్ రెడ్డీస్ (+ 3.54%), లూపిన్ (+ 2.4%),ఐసీఐసీఐ బ్యాంక్ (+ 1.82%), ఆసియా పెయింట్స్ (+ 1.32%) లాభపడగా, ఇన్ఫోసిస్(-1.24%), హీరో మోటోకార్ప్ (-0.9%), అదానీ పోర్ట్స్ (-0.53%), రిలయన్స్ (-0.53%), యాక్సిస్ బ్యాంక్ (-0.52 %) నష్టపోయిన వాటిలో ఉన్నాయి.
Comments
English summary
మళ్లీ కొత్త రికార్డులను నమోదు చేసిన సూచీలు | two stock market indices closed at new peaks
Story first published: Monday, May 15, 2017, 17:00 [IST]