స్వల్ప లాభంతో ముగిసిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్లో ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన మార్కెట్లు అనంతరం నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే లోయర్ లెవెల్స్లో క
దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్లో ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన మార్కెట్లు అనంతరం నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే లోయర్ లెవెల్స్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. తిరిగి ప్రాఫిట్ బుకింగ్ కారణంగా చివరికి సెన్సెక్స్ 7 పాయింట్ల లాభంతో 29,933 వద్ద ముగియగా, నిఫ్టీ 3 పాయింట్లు లాభపడి 9,316.85 దగ్గర స్థిరపడింది.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందినా.. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన ఇండెక్స్లు చివర వరకూ నిలకడగానే సాగాయి. ట్రేడింగ్ ప్రారంభంలో ఒకసారి.. మిడ్ సెషన్ తర్వాత మరోసారి నష్టాల్లోకి జారుకున్నా లోయర్ లెవెల్స్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. మధ్యాహ్న సమయంలో రోజు గరిష్టాన్ని అందుకున్నా.. హైయర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా సూచీలు లాభాల్లో అంతగా రాణించలేదు.