For Quick Alerts
For Daily Alerts
59 రెట్లు ఓవర్సబ్స్క్రైబ్ అయిన ఎస్ చాంద్
ఎస్ చాంద్ తొలి పబ్లిక్ ఆఫర్కు మదుపర్ల నుంచి విశేష స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా జారీ చేసిన షేర్లకు 59.28 రెట్లు అత్యధికంగా బిడ్లు దాఖలయ్యాయి. పబ్లిక్ ఇష్యూ కోసం 76,85,284 షేర్లను ఎస్ చాంద్
|
ఎస్ చాంద్ తొలి పబ్లిక్ ఆఫర్కు మదుపర్ల నుంచి విశేష స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా జారీ చేసిన షేర్లకు 59.28 రెట్లు అత్యధికంగా బిడ్లు దాఖలయ్యాయి. పబ్లిక్ ఇష్యూ కోసం 76,85,284 షేర్లను ఎస్ చాంద్ కేటాయించింది. అయితే 45,56,00,794 షేర్లకు మదుపర్లు బిడ్లు దాఖలు చేశారు. రిటైల్ విభాగం సుమారు 5 రెట్లకు పైగా పైగా ఓవర్సబ్స్ర్కైబ్ అయింది. నాన్ ఇన్స్టిట్యూషనల్, హెచ్ ఎన్ ఐ ల పోర్షన్లకు కూడా అనూహ్యమైన స్పందన లభించింది.
పబ్లిక్ ఇష్యూకు ధరల శ్రేణిగా రూ.660- 670ని నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా రూ.782.50 కోట్ల వరకు సమీకరించాలని కంపెనీ భావించింది. ఈ నిధులను రుణాలు తీర్చేందుకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వాడతారని తెలుస్తోంది.
Comments
English summary
59 రెట్లు ఓవర్సబ్స్క్రైబ్ అయిన ఎస్ చాంద్ | S Chand gets 60 times subscription
Story first published: Saturday, April 29, 2017, 14:21 [IST]