జీడీపీ వృద్ది తిరిగి 8 శాతానికి
రాబోయే 2-3 సంవత్సరాల్లో భారత జిడిపి వృద్ధిరేటు తిరిగి 8 శాతాన్ని అందుకుంటుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. తద్వారా వచ్చే దశాబ్దకాలంలో పేదరికం వేగంగా తగ్గుముఖం పడుతుందని అభిప్రాయపడింది. శుక్రవారం మూడ
రాబోయే 2-3 సంవత్సరాల్లో భారత జిడిపి వృద్ధిరేటు తిరిగి 8 శాతాన్ని అందుకుంటుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. తద్వారా వచ్చే దశాబ్దకాలంలో పేదరికం వేగంగా తగ్గుముఖం పడుతుందని అభిప్రాయపడింది. శుక్రవారం మూడేళ్లకు అభివృద్ది అజెండాకు మార్గసూచీని తయారు చేసిన నీతి ఆయోగ్ పన్నులు, వ్యవసాయం, పరిపాలన విధానంలో పలు సంస్కరణల ఆవశ్యకతను నొక్కిచెప్పింది. వీటి ద్వారానే దేశంలో బహుముఖ వృద్ది సాధ్యమని తెలిపింది.
ఇక ప్రత్యేక కోర్టులు బలోపేతం కావాలని, పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కారం జరగాలంది. నల్లధనం, అవినీతి నిర్మూలనలో భాగంగా సమర్థవంతమైన పన్నుల విధానాన్ని అమలు పరుస్తున్నామంది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని అలాగే ఉంచాలని ఎక్కువ మంది పన్ను పరిధిలో ఉండేందుకు ఇది దోహదపడగలదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా(నీతి ఆయోగ్) సూచించింది.