తుది దశలో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి రద్దు వ్యవహారం
విదేశీ పెట్టుబడుల వ్యవహారాలు పర్యవేక్షించేందకు గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎఫ్ఐపీబీ) రద్దు వ్యవహారం తుది దశలో ఉన్నట్లు జైట్లీ వెల్లడించారు. ద
జీఎస్టీ విధానంలో అమలుపరిచే తుది రేట్లలో ఆశ్చర్యకరమైన అంశాలు ఉండవని అరుణ్ జైట్లీ స్పష్టపరిచారు. శుక్రవారం దేశ రాజధానిలో సీఐఐ వార్షిక సమావేశంలో పాల్గొన్న జైట్లీ జీఎస్టీకి సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న రేట్లతో పోల్చితే జీఎస్టీ రేట్లలో పెద్దగా పెంపుదల ఉండకపోవచ్చని అన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో వసూలు చేస్తున్న రేట్లలో సంక్లిష్టతలు తొలగిపోయి పన్ను భారం తగ్గినట్లయితే ఈ ప్రయోజనాన్ని కంపెనీలు వినియోగదారులకు అందించాలని సూచించారు. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) విధానంలో అమలయ్యే తుది రేట్లను నిర్ణయించేందుకు జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ మండలి మే 18,19 తేదీల్లో శ్రీనగర్లో సమావేశం అవుతుంది.
విదేశీ పెట్టుబడుల వ్యవహారాలు పర్యవేక్షించేందకు గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎఫ్ఐపీబీ) రద్దు వ్యవహారం తుది దశలో ఉన్నట్లు జైట్లీ వెల్లడించారు. దీంతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో మరిన్ని సంస్కరణలకు రంగం సిద్దమవుతున్నట్లు ఆయన చెప్పారు. భారత్లో 90 శాతం విదేశీ పెట్టుబడులు ఆటోమేటిక్ రూట్లో వస్తుండగా మిగతా 10 శాతం కోసమే ప్రత్యేక యంత్రాంగం అవసరమా అనే మీమాంసలో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన వివరించారు.